Naga Babu: పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ నేతల్లా దిగజారి మాట్లాడలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Babu: జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఉంటే అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయినా పొత్తులపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక ఏదో వ్యూహం ఉందని నాగబాబు అన్నారు. వైసీపీ విమర్శ అనేది దాటిపోయి తిట్టడం అనే కొత్త సంస్కృతి తెచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా విమర్శించొచ్చని.. కానీ వైసీపీలా దిగజారి తాము మాట్లాడలేమన్నారు. పవన్ కళ్యాణ్ను సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు. లైం లైట్లోకి రావడానికి తమను విమర్శిస్తున్నారని.. వారికి ఉపయోగపడుతుందంటే తిట్టనివ్వండి అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు సేవ చేసే కృషిలో ఉన్నామన్నారు.
Read Also: NVSS Prabhakar: కేసీఆర్ కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధిని చూపించాలి..
Also Read
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
సింహం సింగిల్ వస్తుందనే సినిమా డైలాగులకు తాము స్పందించాల్సిన అవసరం లేదని నాగబాబు అన్నారు. జర్మనీని ఓడించడానికి అమెరికా , రష్యా వంటి దేశాలు కలిశాయని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కూడా ఇతరులతో కలవాల్సి వస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయను.. పార్టీని పటిష్టం చేయడానికి పని చేస్తానని నాగబాబు చెప్పారు. 2019లో 7 శాతం ఓట్లు వచ్చిన జనసేన ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని.. రాబోయే రోజుల్లో 40 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేనపై జనంలో అభిమానం, నమ్మకం ఉండదన్నది నిజం కాదని.. స్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా ఎన్నికల్లో ఓడిపోయాయని నాగబాబు గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..