Naga Babu: పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ నేతల్లా దిగజారి మాట్లాడలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Babu: జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఉంటే అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయినా పొత్తులపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక ఏదో వ్యూహం ఉందని నాగబాబు అన్నారు. వైసీపీ విమర్శ అనేది దాటిపోయి తిట్టడం అనే కొత్త సంస్కృతి తెచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా విమర్శించొచ్చని.. కానీ వైసీపీలా దిగజారి తాము మాట్లాడలేమన్నారు. పవన్ కళ్యాణ్ను సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు. లైం లైట్లోకి రావడానికి తమను విమర్శిస్తున్నారని.. వారికి ఉపయోగపడుతుందంటే తిట్టనివ్వండి అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు సేవ చేసే కృషిలో ఉన్నామన్నారు.
Read Also: NVSS Prabhakar: కేసీఆర్ కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధిని చూపించాలి..
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
సింహం సింగిల్ వస్తుందనే సినిమా డైలాగులకు తాము స్పందించాల్సిన అవసరం లేదని నాగబాబు అన్నారు. జర్మనీని ఓడించడానికి అమెరికా , రష్యా వంటి దేశాలు కలిశాయని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కూడా ఇతరులతో కలవాల్సి వస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయను.. పార్టీని పటిష్టం చేయడానికి పని చేస్తానని నాగబాబు చెప్పారు. 2019లో 7 శాతం ఓట్లు వచ్చిన జనసేన ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని.. రాబోయే రోజుల్లో 40 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేనపై జనంలో అభిమానం, నమ్మకం ఉండదన్నది నిజం కాదని.. స్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా ఎన్నికల్లో ఓడిపోయాయని నాగబాబు గుర్తుచేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!