Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేదే మా నినాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar Interesting Comments On Chandrababu Pawan Kalyan Meeting: జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేదే తమ విధానం, నినాదమని పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారని చెప్పారు. నిన్న చంద్రబాబుతో పవన్ జరిపిన చర్చల్లోనూ అదే కీలక అంశమని తెలిపారు. భవిష్యత్లో వారి మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోందన్నారు. సీట్లపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, దాన్ని భరించలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా & ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని అన్నారు. తాను ఎక్కడ కాపురం పెడితే, అక్కడి నుంచే పరిపాలన అనే అభిప్రాయం కల్పించేలా సీఎం వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉందని విమర్శించారు. వైసీపీ వ్యతిరేకులంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి, దాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. తొమ్మది మంది మృతి
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అంతకుముందు పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంలోనూ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్న ఆయన.. ఈ ప్రాజెక్టుని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపణలు చేశారు. 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును.. మొదటి దశలో 41.15కు పూర్తి చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే.. ప్రాజెక్టు మరమత్తు కోసం రూ.2,030 కోట్ల పోలవరం అధారిటీ నుంచి సాంక్షన్ రాకపోయినా, జీవో విడుదల చేయడం అవినీతి కాదా? అంటూ నిలదీశారు. పోలవరం పూర్తైపోతుందని మభ్యపెట్టడాన్ని ఖండించాలన్నారు. లక్ష కుటుంబాలు నిర్వాసితులైతే.. ప్రభుత్వం కేవలం 24 వేల కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షలు చొప్పున ఇచ్చి, చేతులు దులుపుకుందామని చూస్తోందని మండిపడ్డారు.
Kadapa Crime: ఇంటర్ ఫెయిలైన కూతురు.. అవమానంతో తల్లి ఏం చేసిందంటే?
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!