Nadendla Manohar: పేదల ఇళ్లపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మూడున్నరేళ్లలో నిర్మించిన ఇళ్లు కేవలం 8 శాతమేనని.. పీఎంఏవై ఇళ్లు కేవలం 5 శాతం మాత్రమే నిర్మించారని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇచ్చిన నిధుల నుంచి రూ.1,547 కోట్లు పక్కకు మళ్లించారన్నారు. సమీక్షల్లో వాస్తవాలను తొక్కిపెడుతున్నారని.. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని లోపాలతో నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లోనూ అన్నీ నెరవేర్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.
Read Also: R Krishnnaiah: జగన్ ఓ సంఘ సంస్కర్త.. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించారు
Also Read
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
వైసీపీ ప్రభుత్వం పేదలను ఇళ్ల నిర్మాణం విషయంలో పెద్ద మోసం చేస్తోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అని చెప్పే సీఎం జగన్ ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎన్ని ఇళ్లను నిర్మించి పేదలకిచ్చారో చెప్పాలన్నారు. తన పార్టీ మ్యానిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పుకొనే జగన్ దమ్ముంటే నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పేదలకు 31 లక్షల మందికి 2023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని.. పేదల ఇళ్లకు ఇసుక కూడా ఇవ్వడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘పేదలందరికీ ఇళ్లు’ అనే పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,63,562 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మూడున్నరేళ్లలో కేవలం 1,52,325 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. దాదాపు 80 శాతం ఇళ్లు పునాదులకే పరిమితమయ్యాయని విమర్శలు చేశారు.
యథా రాజా.. తథా అధికారి అని చదువుకోవాలేమో? తాతల కాలం నుంచి రైతుల చేతిలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాక్షసంగా ఉంది.పేదల నుంచి భూములు లాక్కొనేందుకు ఇదే ధోరణి అనుసరిస్తారా@ysjagan గారూ.భూమి కోసం బలైపోయిన శ్రీమతి ఎల్లమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. pic.twitter.com/xVhSHTFU0E
— Manohar Nadendla (@mnadendla) October 27, 2022
తాజావార్తలు
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
-
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్కు పెళ్లి..?
-
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!