Nadendla Manohar: పేదల ఇళ్లపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మూడున్నరేళ్లలో నిర్మించిన ఇళ్లు కేవలం 8 శాతమేనని.. పీఎంఏవై ఇళ్లు కేవలం 5 శాతం మాత్రమే నిర్మించారని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇచ్చిన నిధుల నుంచి రూ.1,547 కోట్లు పక్కకు మళ్లించారన్నారు. సమీక్షల్లో వాస్తవాలను తొక్కిపెడుతున్నారని.. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని లోపాలతో నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లోనూ అన్నీ నెరవేర్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.
Read Also: R Krishnnaiah: జగన్ ఓ సంఘ సంస్కర్త.. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించారు
Also Read
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
వైసీపీ ప్రభుత్వం పేదలను ఇళ్ల నిర్మాణం విషయంలో పెద్ద మోసం చేస్తోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అని చెప్పే సీఎం జగన్ ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎన్ని ఇళ్లను నిర్మించి పేదలకిచ్చారో చెప్పాలన్నారు. తన పార్టీ మ్యానిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పుకొనే జగన్ దమ్ముంటే నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పేదలకు 31 లక్షల మందికి 2023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని.. పేదల ఇళ్లకు ఇసుక కూడా ఇవ్వడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘పేదలందరికీ ఇళ్లు’ అనే పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,63,562 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మూడున్నరేళ్లలో కేవలం 1,52,325 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. దాదాపు 80 శాతం ఇళ్లు పునాదులకే పరిమితమయ్యాయని విమర్శలు చేశారు.
యథా రాజా.. తథా అధికారి అని చదువుకోవాలేమో? తాతల కాలం నుంచి రైతుల చేతిలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాక్షసంగా ఉంది.పేదల నుంచి భూములు లాక్కొనేందుకు ఇదే ధోరణి అనుసరిస్తారా@ysjagan గారూ.భూమి కోసం బలైపోయిన శ్రీమతి ఎల్లమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. pic.twitter.com/xVhSHTFU0E
— Manohar Nadendla (@mnadendla) October 27, 2022
తాజావార్తలు
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!