R Krishnnaiah: జగన్ ఓ సంఘ సంస్కర్త.. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Krishnnaiah: విజయవాడలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల పాటు బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. కానీ ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కానీ ఏపీ సీఎం జగన్ బీసీ కాకపోయినా బీసీల పక్షపాతిగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. అందుకే సీఎం జగన్ను సంఘ సంస్కర్తగా పరిగణించాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఏపీలో బీసీలను వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని పేర్కొన్నారు.
Read Also: Comedian Ali: బిగ్ బ్రేకింగ్.. ఆలీకి కీలక పదవి కట్టబెట్టిన జగన్
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
మరోవైపు బీసీల ఆత్మగౌరవ సభలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొని ప్రసంగించారు. బీసీ ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య ప్రముఖుడు అని.. ఆయన లాంటి ఉద్యమ నేతకు రాజ్యసభ సీటు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని సజ్జల తెలిపారు. బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. గడిచిన మూడున్నర ఏళ్లలో బీసీల జీవితాలలో గణనీయమైన మార్పు వచ్చిందని సజ్జల అన్నారు. ప్రభుత్వంపై ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని.. గత మూడున్నర ఏళ్లలో అసమానతలను తొలగించామని చెప్పారు. జాతీయ పార్టీలో ఉండి కూడా దివంగత సీఎం వైఎస్ఆర్ బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన తన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యనికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బీసీల తలరాతలను వారే మార్చుకునేలా సీఎం జగన్ బీసీలకు అవకాశం కల్పించారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసలు కురిపించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!