కడప జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి: విజయసాయిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శీతకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యా సభలో జీరో అవర్లో కడప జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. టెక్స్టైల్ పార్క్ ఆవశ్యకతను వివరించారు. కొప్పర్తిలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా ఏడు “మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్”, “అప్పరెల్ పార్కు” (మిత్రా) చేయాలని నిర్ణయించిందని దీన్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కడపజిల్లాలోని కొప్పర్తిలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన “మిత్రా” పార్కు ద్వారా స్పిన్నింగ్, డైయింగ్, ప్రింటింగ్ వంటి ప్రక్రియలు ఒకే చోట చేపట్టే వీలుందన్నారు. దీని ద్వారా టెక్స్టైల్ వాల్యూ చైన్ యావత్తు ఒకే చోట సమీకృతమై ఉంటుందని సభలో పేర్కొన్నారు. “మిత్రా” పార్కులలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన అవకాశం ఉందన్నారు.
also read:సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్లను ఏర్పాటు చేయాలి: వేంరెడ్డి ప్రభాకర్రెడ్డి
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
ఫలితంగా రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ పార్కులు ఏర్పాటు వల్ల దేశియంగా, అంతర్జాతీయంగా టెక్స్టైల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోకి కొప్పర్తిలో ఇప్పటికే అనేక టెక్స్టైల్ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం “మెగా ఇండస్ట్రియల్ హబ్”ను ఏర్పాటు చేసిందని సభకు వివరించారు. మిత్రా పార్కు అభివృద్ధికి అవసరమైన రోడ్డు, రవాణా వంటి మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలను ప్రకటించి ఈ ప్రాంతాన్ని పెట్టుబడిదారుల అనుకూల ప్రాంతంగా ప్రోత్సాహిస్తోందన్నారు. దేశంలో కాటన్, సిల్క్ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది నిపుణులైన హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్మికులు ఉన్నారని తెలిపారు. “మిత్రా” పార్క్ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఏకైక నోడల్ పాయింట్గా అభివృద్ధి చెంది, సరఫరా సమీకృతం కావడానికి దోహదపడుతుందని సభలో విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!