AP Special Status: ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు.. కేంద్రం ఇవ్వాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy Demands AP Special Status In Lok Sabha: ప్రత్యేక హోదా విషయాన్ని వైఎస్సార్సీపీ మరోసారి లోక్సభలో లేవనెత్తింది. ఈ ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రం దానిని ఇప్పటికైనా రాష్ట్రానికి ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం అండగా నిలిచి, అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా.. డిసెంబర్ 13వ తేదీన లోక్సభలో జరిగిన చర్చలో, విభజనతో ఏపీ ఎలా నష్టపోయిందో మిథున్ రెడ్డి వివరిస్తూ, ప్రత్యేక హోదా అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.
Lionel Messi: మెస్సీ సంచలన ప్రకటన.. ఇదే చివరిదంటూ బాంబ్
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
లోక్సభలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్సీపీకి 20 మందికి పైగా లోక్సభ ఎంపీలు ఉన్నారు. మేము ఎన్నోసార్లు ప్రత్యేక హోదా విషయాన్ని లేవనెత్తాం. వివిధ ఫార్మాట్లలో 100 సార్లు విజ్ఞప్తి చేశాం. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏపీకి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు’’ అని అన్నారు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఏపీని చాలా అన్యాయంగా విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరంలో.. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 15,454 కోట్లు ఉంటే, ఏపీకి రూ. 8,979 కోట్లు మాత్రమేని పేర్కొన్నారు. తాము జనాభాలో 56%, ఆదాయంలో 45%, అప్పులను 60% వారసత్వంగా పొందామని చెప్పారు.
Arjun Tendulkar: తండ్రి బాటలో తనయుడు.. తొలి రంజీ మ్యాచ్లోనే సెంచరీ
ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సభలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. కానీ.. విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదన్నారు. కాబట్టి.. కేంద్రం మరోసారి ఈ అంశాన్ని ప్రాధాన్యతగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్షల్ని జాతీయ స్థాయిలో చర్చించి.. ఈ హోదాని సాధించేందుకు వైసీపీ కట్టుబడి ఉందన్నారు. జాతీయ స్థాయిలో ఏపీ సమస్యలను లేవనెత్తడం ద్వారా.. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం మరోసారి ప్రత్యేక హోదాను చర్చకు తెచ్చిందని, కేంద్ర ఈ అంశాన్ని పరిష్కరిస్తుందని నమ్మకం ఉందని ఆయన మిథున్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!