MP Margani Bharat Ram: జగన్ పాలనపై అన్ని వర్గాలు పూర్తి సంతృప్తి.. ప్రజలకు ఏం కావాలో ఆయనకే తెలుసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat Ram: పేదల గుండె చప్పుడు, వారి హృదయంలో మాట, వారికేమి అవసరమో ఒక్క సీఎం వైఎస్ జగనన్నకే తెలుసునని, అందుకే ప్రజలంతా ‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమండ్రి 38వ వార్డు సీతంపేట ఫారెస్ట్ కల్యాణ మండపంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పిల్లి సుభాస్ చంద్రబోస్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్, కరపత్రాలు, మొబైల్ ఫోన్ స్టిక్కర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకూ జరగలేదన్నారు.
Read Also: Pushpa 2: పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
ఇక, ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పాలన ఒక మహా యజ్ఞంలో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారని తెలిపారు ఎంపీ భరత్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినది మొదలు నేటి వరకూ ఈ నాలుగేళ్ళలో రూ.2లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా సొమ్ములు జమ చేసిన ఘనత జగనన్నదని అన్నారు. నాలుగు సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి చేస్తే, మరో ఐదు సంవత్సరాలు మళ్లీ సీఎంగా జగనన్నకే అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని మరింత సర్వతోముఖాభివృద్ధి చేస్తారన్నారు. పేదలను అన్ని విధాలా ఆదుకుని, వారి జీవన విధానంలో పెనుమార్పులు తీసుకు రావాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపన దిశగా జగన్ పాలన కొనసాగుతోందని, జగన్ పాలనపై అన్ని వర్గాల నుండి పూర్తి సంతృప్తి, హర్షం వ్యక్తమవుతోందని ఎంపీ భరత్ తెలిపారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో గృహసారథులు, కన్వీనర్లు ప్రతీ ఇంటికి వెళ్లి కనీసం 5 నిమిషాలు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. జగన్ పాలనపైనా, సంక్షేమ పథకాలు అమలుపైనా అయిదు ప్రశ్నలు అడిగి, రికార్డు చేసుకుంటారని చెప్పారు. గృహ యజమానుల అనుమతితో ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో కూడిన స్టిక్కర్ ఇంటి తలుపునకు అంటించడం, మొబైల్ కు స్టిక్కర్, అలాగే ఫోన్ ద్వారా సమాచారం పంపడం జరుగుతుందని వివరించారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!