Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రశ్నించిన జీవీఎల్.. కేంద్రం సమాధానం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దీర్ఘకాలిక పదవీ విరమణ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత మరియు కృషిని కొనియాడుతూనే.. ఉద్యోగుల సమస్యలను పార్లమెంటులో ఉక్కు శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు.. విశాఖ ఉక్కు కర్మాగారంగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పదవీ విరమణ జరుగుతున్న ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న మానవ వనరుల పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలని, తద్వారా ఉత్పన్నమయ్యే ఇతర సమస్యలను గురించి ఉక్కు మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు జీవీఎల్.. ఇక, దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సమాధానమిస్తూ.. పూర్తి స్థాయి కార్యకలాపాల కోసం ఉద్యోగుల పునర్ వ్యవస్థీకరణ చేస్తామని, మిగతా కార్యకలాపాలకు ఔట్ సోర్సింగ్ను ఆశ్రయిస్తామని తెలియజేశారు.
Read Also: Ponguleti Srinivas Reddy: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. !
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
విశాఖ స్టీల్ ప్లాంట్పై ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రశ్నలు సందించిన జీవీఎల్.. ఆర్ఐఎన్ఎల్ లోని సిబ్బంది పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే సమాధానమిస్తూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం 14,880 మంది ఉద్యోగులు ఉన్నారని, గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, వచ్చే మూడేళ్లలో 1,170 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, 2,039 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు సహా 3,209 మంది ఉద్యోగులు ఆర్ఐఎన్ఎల్ రికార్డుల ప్రకారం పదవీ విరమణ చేయనున్నారని తెలిపారు.. అయితే, పెద్ద ఎత్తున ఉద్యోగుల పదవీ విరమణ కారణంగా ఏర్పడుతున్న సిబ్బంది కొరతను విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా ఎదుర్కొంటుందని జీవీఎల్ ప్రశ్నించగా, అంతగా ప్రాధాన్యత లేని కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడం ద్వారా, ప్రధాన కార్యకలాపాల్లో సిబ్బందిని పునర్ వ్యవస్థీకరణ ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చుతున్నామని పేర్కొన్నారు. ఉద్యోగుల కొత్త నియామకాల గురించి ఎంపీ జీవీఎల్ ప్రశ్నించగా కొత్త నియామకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గత మూడేళ్లలో 106 మంది కొత్త ఉద్యోగులను నియమించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆర్ఐఎన్ఎల్ లో పెద్ద ఎత్తున పదవీ విరమణల పరిస్థితిపై ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ, ఆర్ఐఎన్ఎల్ యొక్క ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ మంచి పనితీరు కనబరిచిన ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగుల కృషిని ప్రశంసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ సిబ్బందికి సంస్థపై కల అభిమానం మరియు వారినిబద్ధత వల్లనే ఆ స్థాయి ఉత్పాదకత సాధ్యమైందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!