Nallapareddy Prasanna Kumar Reddy: ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ.. ఇక చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ చెప్పుకొస్తుందే.. అయితే, టీడీపీ నేతలకు సవాల్ చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. దాదాపు 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఆంబోతు అచ్చెన్నాయుడుకు మెదడులో తెలివి లేదు.. కానీ, మోకాల్లో ఉంది అంటూ ఫైర్ అయ్యారు.. దేనికి పనికిరాని దద్దమ్మ అచ్చెన్నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ధైర్యం ఉంటే మీతో టచ్ లో ఉన్న 40 మంది వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు.. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడే మైండ్ గేమ్ గా అభివర్ణించిన ఆయన.. ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఒక పెద్ద నాటకానికి తెరతీస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.
Read Also: TDP: 41 ఏళ్ల టీడీపీ ప్రస్థానం.. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను దాటుకుంటూ ప్రయాణం
డబ్బుకు అమ్ముడుపోయిన వారు పార్టీ నుంచి వెళ్లిపోయారు.. చెరో పది కోట్లు తీసుకుని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు అంటూ పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలపై మండిపడ్డారు ప్రసన్నకుమార్రెడ్డి.. ఇక, మాది రాజకీయ కుటుంబమైనా వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచానని పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కాగా, ఈ మధ్య నెల్లూరు జిల్లాకు చెందిన మరో పెద్దారెడ్డి వైసీపీకి గుడ్బై చెప్పేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేసిన నేపథ్యంలో.. ఆ వార్తలపై స్పందించిన ఆయన.. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం సరికాదన్న ఆయన.. మాది రాజకీయ కుటుంబం.. నా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. మంత్రిగా పనిచేశా.. సీఎం వైఎస్ జగన్ నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు.. అసలు నేను పార్టీ మారడం ఏంటి? అని ప్రశ్నించారు. 2012లో ఉప ఎన్నికల్లో కోవూరు నుంచి గెలిచా.. నా చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్ జగన్తోనే ఉంటానని స్పష్టం చేశారు నల్లపరెడ్డి… వాళ్ల ఇంట్లో బిడ్డలా చూసుకుంటున్నారు.. నెల్లూరు బ్యారేజ్ కు మా నాన్న శ్రీనివాసులు రెడ్డి పేరు పెట్టారు అని గుర్తుచేశారు. కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని ద్రోహం చేశారని మండిపడ్డ ఆయన.. ఈ గేమ్ చంద్రబాబు ఆడుతున్నాడు.. గతంలో ఆయన సీఎం అయ్యేటప్పుడు కూడా ఇదే గేమ్ ఆడారంటూ మండిపడిన విషయం విదితమే.