దళితుల గురించి చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. దళితుల గురించే మాట్లాడే నైతికత, అర్హత చంద్రబాబుకు లేదు. దళితులను అవమానించినందుకు అంబేద్కర్ విగ్రహం ముందు చంద్రబాబు ముక్కు నేలకు రాయాలి అని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళితులపై దాడులు ఆరోపణలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. బలంగా ఉన్న దళితులను విభజించి పాలించాలనేది చంద్రబాబు నైజం. దళితులను వాడుకుని వదిలేయడమే చంద్రబాబు పని. రాజధానిలో దళితులకు ఇళ్లపట్టాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఎస్సీ, ఎస్టీల ఇంటికీ వెళ్తున్నాయి. దళితులను ఏదో చేయాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు, జగన్ ల పాలనలో ఎస్సీ ,ఎస్టీల సంక్షేమంపై చర్చకు సిద్దం అని పేర్కొన్నారు.