MLA Kannababu: చంద్రబాబు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి.. బీజేపీకి కన్నుకొడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kannababu Sensational Comments On Chandrababu Naidu Manifesto: మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రాజమండ్రిలో మహానాడు అనే డ్రామా కంపెనీని నడిపాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్కు నైతిక విలువలు లేవని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ను శకపురుషుడు అంటూ కీర్తిస్తున్నాడని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోను తీసుకువచ్చి.. తన మేనిఫెస్టోగా చంద్రబాబు చెప్తున్నాడని ఆరోపించారు. దేవుడు చంద్రబాబుకి సిగ్గు పెట్టలేదన్న ఆయన.. మహానాడులో పొత్తుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి.. బీజేపీకి కన్నుకొడుతున్నాడని ధ్వజమెత్తారు.
Kakani Govardhan Reddy: చంద్రబాబు రాయి వేశారే తప్ప.. చేసిందేమీ లేదు
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
అంతకుముందు కూడా.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కన్నబాబు వ్యాఖ్యానించారు. సభల్లో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని, చంద్రబాబు పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దేవుడు మతిమరుపు అనే వరం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక నారా లోకేష్ పెద్ద ఐరన్ లెగ్ అని ప్రజలు అనుకుంటున్నారని.. వీళ్ల ప్రచారయావతో నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో అమాయకులను పొట్టన పెట్టుకున్నారనని మండిపడ్డారు. పుష్కరాల్లో కూడా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అయ్యారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, సీఎం జగన్ ప్రతి పేదవాడి గుండె చప్పుడు వింటున్నారని పేర్కొన్నారు. టీడీపీకి బలం లేకనే మిగిలిన పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.
Gudivada Amarnath: ఉన్నమాట అంటే ఉలుకెందుకు.. ఫ్లెక్సీ వివాదంపై మంత్రి అమర్నాథ్ రియాక్షన్
తాజావార్తలు
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!