Kakani Govardhan Reddy: చంద్రబాబు రాయి వేశారే తప్ప.. చేసిందేమీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Fires On Chandrababu Naidu: కృష్ణపట్నం పోర్టుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాయి వేశారే తప్ప.. అంతకుమించి చేసిందేమీ లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తన హయాంలో రామాయపట్నం పోర్టును చంద్రబాబు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత అభివృద్ది కోసం సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభించారని చెప్పారు. నెల్లూరు జిల్లా అభివృద్ది జరిగింది అంటే.. అది దివంగత నేత వైఎస్సార్, సీఎం జగన్ హయాంలోనే అని పేర్కొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా జరగుతున్నాయని అన్నారు.
Gudivada Amarnath: ఉన్నమాట అంటే ఉలుకెందుకు.. ఫ్లెక్సీ వివాదంపై మంత్రి అమర్నాథ్ రియాక్షన్
Also Read
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా పలు పరిశ్రమలను సీఎం జగన్ తీసుకొచ్చారని.. రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ పరిపాలన అంటే బటన్ నొక్కుడేనా అని కొందరు అంటున్నారని.. అభివృద్ది గురించి మాట్లాడే వారికి, చేసిన పనులు చూసి మాట్లాడాలని హితవు పలుకుతున్నామని చురకలంటించారు. రామాయపట్నం పోర్టును సీఎం జగన్ చేతుల మీదుగా, అనుకున్న సమయానికే ప్రారంభిస్తామని తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి కాకాణి విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే టీడీపీ కాపీ కొట్టిందని ఆరోపించారు. తన మేనిఫెస్టోలో చంద్రబాబు పొందుపరిచిన హామీలన్నీ కాపీ కొట్టినవేనని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. గతంలోనూ రుణమాఫీ అమలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు.
Merugu Nagarjuna: చంద్రబాబు పార్టీ శవపేటికలా ఉంది.. మంత్రి నాగార్జున ధ్వజం
అంతకుముందు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతాంగానికి ద్రోహం చేస్తే, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని మంత్రి కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా గతంలో ఓట్లు వేయించిన పవన్.. చంద్రబాబు హయాంలో రైతులు పడ్డ ఇబ్బందులు కనిపించలేదా? అని అడిగారు. నాడు మొద్దు నిద్రలో ఉన్న పవన్.. ఇప్పుడు నిద్ర లేచి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులని.. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు మాటలు, సినిమాలు చేసుకునే పవన్ మాటల్ని తాము పట్టించుకోమని తేల్చి చెప్పేశారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!