Ambati Rambabu: పవన్ సలహాలు మాకెందుకు? మంత్రులపై దాడి చేస్తే సన్మానాలు చేయాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో విశాఖ ప్రధానమైన నగరం అని.. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే నగరం అని.. ఇలాంటి ప్రశాంతమైన నగరాన్ని అలజడి నగరంగా తయారైన పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నారని.. రైతుల పాదయాత్ర పేరుతో విశాఖపై దాడి చేయించటానికి చంద్రబాబు ఓ వైపు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పాదయాత్ర చేస్తున్న వాళ్ళు తొడలు కొడుతున్నారని.. మీసాలు తిప్పుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ బాబు వాణి వినిపించటానికే వైజాగ్ వచ్చాడని.. మంత్రుల మీద దాడి చేసిన జనసేన నాయకులకు సన్మానం చేయాలా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం పవన్కు ఆర్ధిక సన్మానం కూడా చేస్తాడన్నారు.
Read Also: Baba Ramdev: సల్మాన్ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎయిర్ పోర్ట్ దగ్గర దాడి జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ర్యాలీగా ఎలా వెళ్తాడని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. ఎవరైనా రాయి విసిరితే.. బాధ్యత ఎవరిది అన్నారు. అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఒక బానిస అని విమర్శించారు. విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదని.. ఎందుకు ఈ సైకో చేష్టలు అని మండిపడ్డారు. పవన్ తన భస్మాసుర హస్తం తనమీదే పెట్టుకుంటున్నాడన్నారు. పవన్ది జనసేన కాదని బాబుసేన అని ఎద్దేవా చేశారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలు ఉంటారని.. జనసేన పార్టీకి సైనికులు ఉండటమేంటని నిలదీశారు. హింసకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరని.. హింసను ప్రేరేపించే ఏ రాజకీయ పార్టీ బతికి బట్టకట్టదన్నారు.
అటు పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కామెంట్లపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్ ఇచ్చారు. మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయమని.. మూడు కాకపోతే నాలుగు పెళ్లిళ్లు చేసుకోమనండి.. అవసరమైన వాళ్లు విడాకులు తీసుకుంటున్నారని.. పవన్ సలహాలు తమకెందుకు అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతున్న విశాఖను రాజధానిగా ప్రకటిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!