ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని.. చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా…
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంరతం ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులను జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈహెచ్ఎస్కు అవకాశం లేని ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉద్యోగుల వైద్యం చేయించుకుంటున్నారు. దీంతో ఇతర ఉద్యోగుల మాదిరిగా వారుకూడా వైద్య ఖర్చులను మెడికల్ రీఎంబర్స్ చేసుకునేలా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వారు ఆనందం…
పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక, భూకబ్జాలు, లిక్కర్, గనులదోపిడీతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పేద ప్రజలను కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి గత ప్రభుత్వాలు చేసిన పనులను తాము చేసినట్టు రంగులు వేసుకుని…
తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.రూ. 50లక్షలు అందించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మరణించిన సంగతి తెల్సిందే.. వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్ఏ టెస్టులు చేసి…
దళితులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని అమలాపురం మాజీ ఎంపీ జి.వి హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. జగన్ చెల్లెలు కులాంతర వివాహాం చేసుకున్న ఫర్వాలేదు. కానీ ఇతరులు చేసుకుంటే కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం నిలిపివేసిందని హర్షకుమార్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రభుత్వం నాన్చుడి…
మోడల్ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో రాజీ పడబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుందని ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఎక్కడైనా మెనూ సరిగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా ఖాజీపేట పాఠశాలల్లో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఏం…
ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశీ ప్రయాణికులపై ఫోకస్ పెట్టింది. సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, హంగ్కాంగ్ నుంచి వస్తున్న వారి పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. త్వరలోనే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి తెస్తామన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిలో పాస్పోర్ట్లో ఏపీ అడ్రస్ ఉన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో రికవరీ…
వాహనదారులకు ఏపీ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. బుధవారం సినిమాటోగ్రఫీ బిల్లుతో పాటు వాహన పన్నుల చట్ట సవరణ బిల్లును మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్, పాత వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ చట్ట సవరణ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అధిక కర్బనాలను విడుదల చేసే వాహనాలను నివారించేందుకు ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అందుకే గ్రీన్ ట్యాక్స్ పేరిట పన్నులు…
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నిరసనలకు పిలుపు ఇవ్వగా.. అధికార పార్టీ వైసీపీ కౌంటర్ ఎటాక్కు దిగింది. బీజేపీ తీరుపై ఏకంగా పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?’ అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.100 దాటించి రూ.5, రూ.10 తగ్గించామని పెంచినోళ్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా? అని నిలదీసింది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి…
సీఎం జగన్ చేతకానితనంతో, అవినీతి ధన దాహంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఓ వైపు విద్యుత్ బిల్లుల మోతలు, మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కరెంట్ ఉత్పత్తి చేయటం చేతకాక సాయంత్రం 6 నుంచి 10 వరకు ఏసీలు ఆపు చేయమంటున్నారు. మరో నెల ఆగితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది…