Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Satya Kumar Yadav Fires On Ys Jagan

Minister Satya Kumar: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్

Published Date :March 12, 2025 , 3:36 pm
By Chandra Shekhar Pamena
  • వైఎస్ జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్..
  • రాష్ట్రంలో వైద్య విద్యను భ్రష్టు పట్టించారని ఆగ్రహం..
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్: మంత్రి సత్యకుమార్
Minister Satya Kumar: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Satya Kumar: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు. జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఏపీకి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి గ్రాంట్లు, రుణ రూపంలో రూ. 4900 కోట్లిచ్చింది అని గుర్తు చేశారు. చేతకాని నాటి సీఎం జగన్ పులివెందులతో సహా ఒక్క కాలేజీకి కూడా కావాల్సిన వసతులు పూర్తి చెయ్యలేదు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు.

Read Also: Telangana Assembly : 27 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ పెట్టేది ఆ రోజే..

Also Read

  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • Nadendla Bhaskara Rao Passes Away: మాజీ సీఎం కన్నుమూత.. నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!
  • Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!
  • Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. ​50 మంది కార్మికులపై యజమాని..!

ఇక, ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ. 8,480 కోట్లలో కేవలం 15 శాతం మాత్రమే నాలుగేళ్లలో ఖర్చు చేశారు అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మిగిలిన నిధుల్ని జగన్ దారి మళ్లించారు.. దాని కారణంగా రాష్ట్రం 2500 మెడికల్ సీట్లు మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది.. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే జగన్ కుట్ర అర్థమవుతోంది.. ఐదు మెడికల్ కాలేజీలలో అరకొర మౌలిక వసతులతో.. కేవలం పేరు కోసం ఆర్భాటంగా తరగతులు ప్రారంభించారు.. చదువు చెప్పడానికి అధ్యాపకులు లేరు.. సేవలందించడానికి నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది లేరు అని పేర్కొన్నారు. కనీసం, బాలికలు ఉండడానికి వసతి భవనాల్లేవు.. పులివెందుల కళాశాలకు ప్రజాధనం రూ.300 కోట్లు ఖర్చు పెట్టిన జగన్, మదనపల్లిలో 500 కోట్లకు గాను 30 కోట్లు కుడా ఖర్చు పెట్టలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి అన్నారు.

Read Also: Vijayasai Reddy: భయం అనేది నా రక్తంలో లేదు.. పార్టీని విడటంపై విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

అయితే, నర్సీపట్నంలో కేవలం 2 శాతం నిధులు, పాలకొల్లు కాలేజీకి సున్నా నిధులను గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అన్ని మెడికల్ కాలేజీల పరిస్థితి ఇదే.. గిరిజన ప్రాంతంలో పార్వతీపురం కాలేజీ పట్ల చిత్తశుద్ధి లేని గత ప్రభుత్వం టెండర్లు కూడా పిలువలేదు అని ఆరోపించారు. నిధులు ఖర్చు పెట్టకుండా, భవనాలు నిర్మించకుండా, బోధనా సిబ్బందికి నోటిఫికేషన్ ఇవ్వకుండా మెడికల్ కాలేజీలెలా ప్రారంభించాలి? అని ఆయన ప్రశ్నించారు. ఎలా నాణ్యమైన వైద్యవిద్యను బోధించాలి?.. నాలుగేళ్లలో గుర్రం నాడా మాత్రం తెచ్చి.. ఏడాదిలో గుర్రం ఎందుకు తేలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని సత్యకుమార్ యాదవ్ అడిగారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • bjp
  • Minister Satya Kumar Yadav
  • tdp
  • ys jagan

తాజావార్తలు

  • Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..

  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?

  • Tesla Model Y L: టెస్లా మోడల్ Y కొత్త L వేరియంట్ విడుదల.. 661KM రేంజ్‌.. ధర ఎంతంటే?

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..

ట్రెండింగ్‌

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • 144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions