Minister Satya Kumar: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్
- వైఎస్ జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్..
- రాష్ట్రంలో వైద్య విద్యను భ్రష్టు పట్టించారని ఆగ్రహం..
- రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్: మంత్రి సత్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికలో ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన అప్పుల రెడ్డి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను కూడా భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు. జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఏపీకి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి గ్రాంట్లు, రుణ రూపంలో రూ. 4900 కోట్లిచ్చింది అని గుర్తు చేశారు. చేతకాని నాటి సీఎం జగన్ పులివెందులతో సహా ఒక్క కాలేజీకి కూడా కావాల్సిన వసతులు పూర్తి చెయ్యలేదు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు.
Read Also: Telangana Assembly : 27 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్ పెట్టేది ఆ రోజే..
Also Read
- AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
- Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
- AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
ఇక, ఖర్చు పెట్టాల్సిన మొత్తం రూ. 8,480 కోట్లలో కేవలం 15 శాతం మాత్రమే నాలుగేళ్లలో ఖర్చు చేశారు అని మంత్రి సత్యకుమార్ అన్నారు. మిగిలిన నిధుల్ని జగన్ దారి మళ్లించారు.. దాని కారణంగా రాష్ట్రం 2500 మెడికల్ సీట్లు మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది.. రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే జగన్ కుట్ర అర్థమవుతోంది.. ఐదు మెడికల్ కాలేజీలలో అరకొర మౌలిక వసతులతో.. కేవలం పేరు కోసం ఆర్భాటంగా తరగతులు ప్రారంభించారు.. చదువు చెప్పడానికి అధ్యాపకులు లేరు.. సేవలందించడానికి నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది లేరు అని పేర్కొన్నారు. కనీసం, బాలికలు ఉండడానికి వసతి భవనాల్లేవు.. పులివెందుల కళాశాలకు ప్రజాధనం రూ.300 కోట్లు ఖర్చు పెట్టిన జగన్, మదనపల్లిలో 500 కోట్లకు గాను 30 కోట్లు కుడా ఖర్చు పెట్టలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి అన్నారు.
Read Also: Vijayasai Reddy: భయం అనేది నా రక్తంలో లేదు.. పార్టీని విడటంపై విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
అయితే, నర్సీపట్నంలో కేవలం 2 శాతం నిధులు, పాలకొల్లు కాలేజీకి సున్నా నిధులను గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అన్ని మెడికల్ కాలేజీల పరిస్థితి ఇదే.. గిరిజన ప్రాంతంలో పార్వతీపురం కాలేజీ పట్ల చిత్తశుద్ధి లేని గత ప్రభుత్వం టెండర్లు కూడా పిలువలేదు అని ఆరోపించారు. నిధులు ఖర్చు పెట్టకుండా, భవనాలు నిర్మించకుండా, బోధనా సిబ్బందికి నోటిఫికేషన్ ఇవ్వకుండా మెడికల్ కాలేజీలెలా ప్రారంభించాలి? అని ఆయన ప్రశ్నించారు. ఎలా నాణ్యమైన వైద్యవిద్యను బోధించాలి?.. నాలుగేళ్లలో గుర్రం నాడా మాత్రం తెచ్చి.. ఏడాదిలో గుర్రం ఎందుకు తేలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని సత్యకుమార్ యాదవ్ అడిగారు.
తాజావార్తలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!