Minister Roja: పవన్కు మంత్రి రోజా ప్రశ్న.. ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ను పరామర్శిస్తాడని.. చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని మంత్రి రోజా ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్కు ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి రోజా ట్విట్టర్లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే..@ncbn వెళ్లి పవన్ను పరామర్శిస్తాడు.. చంద్రబాబు 11 మందిని చంపితే @PawanKalyan వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు.
వీళ్ళ దృష్టిలో ప్రాణాల కంటే.. ప్యాకేజి నే గొప్పదా..!!Also Read
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 8, 2023
అటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా చంద్రబాబు, పవన్ భేటీ అంశంపై స్పందించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ను చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ప్రకటించగలడా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రచార ఉన్మాదంతో 11 మందిని చంపితే దానిపై పవన్ కళ్యాణ్ సానుభూతి ఎందుకు చూపించలేదని నిలదీశారు. బాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ ప్రజలకు అర్ధం అవుతుందని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడమే అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు, పవన్ కలిశారని విమర్శలు చేశారు. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ పని చేస్తాడని, దమ్ముంటే 175 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు, టీడీపీతో సహజీవనం చేస్తుందని ఆరోపించారు. ఒంటరిగా గెలవలేనని దత్తపుత్రుడితో చంద్రబాబు కలుస్తున్నాడని.. పవన్ కళ్యాణ్కు ఒక అజెండా అంటూ లేదని మంత్రి వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు.
Read Also: Somireddy: వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి.. డైపర్లు పెట్టుకోవాలి..!!
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
-
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
-
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!