Minister Roja: పవన్కు మంత్రి రోజా ప్రశ్న.. ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ను పరామర్శిస్తాడని.. చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని మంత్రి రోజా ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్కు ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి రోజా ట్విట్టర్లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే..@ncbn వెళ్లి పవన్ను పరామర్శిస్తాడు.. చంద్రబాబు 11 మందిని చంపితే @PawanKalyan వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు.
వీళ్ళ దృష్టిలో ప్రాణాల కంటే.. ప్యాకేజి నే గొప్పదా..!!Also Read
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
- Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 8, 2023
అటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా చంద్రబాబు, పవన్ భేటీ అంశంపై స్పందించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ను చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ప్రకటించగలడా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రచార ఉన్మాదంతో 11 మందిని చంపితే దానిపై పవన్ కళ్యాణ్ సానుభూతి ఎందుకు చూపించలేదని నిలదీశారు. బాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ ప్రజలకు అర్ధం అవుతుందని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడమే అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు, పవన్ కలిశారని విమర్శలు చేశారు. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ పని చేస్తాడని, దమ్ముంటే 175 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు, టీడీపీతో సహజీవనం చేస్తుందని ఆరోపించారు. ఒంటరిగా గెలవలేనని దత్తపుత్రుడితో చంద్రబాబు కలుస్తున్నాడని.. పవన్ కళ్యాణ్కు ఒక అజెండా అంటూ లేదని మంత్రి వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు.
Read Also: Somireddy: వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి.. డైపర్లు పెట్టుకోవాలి..!!
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!