Minister Roja: పవన్కు మంత్రి రోజా ప్రశ్న.. ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా?
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ను పరామర్శిస్తాడని.. చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని మంత్రి రోజా ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్కు ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి రోజా ట్విట్టర్లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే..@ncbn వెళ్లి పవన్ను పరామర్శిస్తాడు.. చంద్రబాబు 11 మందిని చంపితే @PawanKalyan వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు.
వీళ్ళ దృష్టిలో ప్రాణాల కంటే.. ప్యాకేజి నే గొప్పదా..!!Also Read
- Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
- Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 8, 2023
అటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా చంద్రబాబు, పవన్ భేటీ అంశంపై స్పందించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ను చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ప్రకటించగలడా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రచార ఉన్మాదంతో 11 మందిని చంపితే దానిపై పవన్ కళ్యాణ్ సానుభూతి ఎందుకు చూపించలేదని నిలదీశారు. బాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ ప్రజలకు అర్ధం అవుతుందని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడమే అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు, పవన్ కలిశారని విమర్శలు చేశారు. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ పని చేస్తాడని, దమ్ముంటే 175 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు, టీడీపీతో సహజీవనం చేస్తుందని ఆరోపించారు. ఒంటరిగా గెలవలేనని దత్తపుత్రుడితో చంద్రబాబు కలుస్తున్నాడని.. పవన్ కళ్యాణ్కు ఒక అజెండా అంటూ లేదని మంత్రి వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు.
Read Also: Somireddy: వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి.. డైపర్లు పెట్టుకోవాలి..!!
తాజావార్తలు
-
Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
-
Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
-
Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
-
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
-
West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!