Minister Roja: పవన్కు మంత్రి రోజా ప్రశ్న.. ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి రోజా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ను పరామర్శిస్తాడని.. చంద్రబాబు 11 మందిని చంపితే పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడని మంత్రి రోజా ఆరోపించారు. అసలు పవన్ కళ్యాణ్కు ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి రోజా ట్విట్టర్లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రుల మీద దాడి చేస్తే..@ncbn వెళ్లి పవన్ను పరామర్శిస్తాడు.. చంద్రబాబు 11 మందిని చంపితే @PawanKalyan వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు.
వీళ్ళ దృష్టిలో ప్రాణాల కంటే.. ప్యాకేజి నే గొప్పదా..!!Also Read
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 8, 2023
అటు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా చంద్రబాబు, పవన్ భేటీ అంశంపై స్పందించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ను చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ప్రకటించగలడా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన ప్రచార ఉన్మాదంతో 11 మందిని చంపితే దానిపై పవన్ కళ్యాణ్ సానుభూతి ఎందుకు చూపించలేదని నిలదీశారు. బాబు డైరెక్షన్ పవన్ యాక్షన్ ప్రజలకు అర్ధం అవుతుందని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఎజెండా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకోవడమే అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ డీల్ కోసమే చంద్రబాబు, పవన్ కలిశారని విమర్శలు చేశారు. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ పని చేస్తాడని, దమ్ముంటే 175 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు, టీడీపీతో సహజీవనం చేస్తుందని ఆరోపించారు. ఒంటరిగా గెలవలేనని దత్తపుత్రుడితో చంద్రబాబు కలుస్తున్నాడని.. పవన్ కళ్యాణ్కు ఒక అజెండా అంటూ లేదని మంత్రి వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు.
Read Also: Somireddy: వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయి.. డైపర్లు పెట్టుకోవాలి..!!
తాజావార్తలు
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన యువతకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ.2 లక్షల చొప్పున సాయం..
-
Deepika: ఆ “హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!”.. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!