Minister Roja: హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: మినిస్టర్ రోజా.. జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఒకరి మీద ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువశక్తి సభలో పవన్.. రోజాను డైమండ్ రాణి అనడం, పవన్ అభిమాని హైపర్ ఆది.. మంత్రులకు శాఖలు కూడా తెలియదు అనడం రెండు తెలుగు రాష్ట్రాలను హీట్ ఎక్కించాయి. ఇక ఈ వ్యాఖ్యలపై రోజా సైతం ఘాటుగా స్పందిస్తూ.. పవన్ ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు వద్ద నుంచి కలక్షన్స్ తీసుకోవడానికి వెళ్లాడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా జగన్ ప్రభుత్వం మంచి చేసింది కాబట్టే తాము గెలిచామని, మరి ఇప్పటివరకు పవన్ ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలవలేదని ప్రశ్నించింది. ఇక నాగబాబు అన్న మాటలకు కూడా ఆమె తనదైన రీతిలో స్పందిస్తూ సమాధానం చెప్పుకొచ్చింది.
Dil Raju: ఏయ్.. ఏయ్.. దిల్ రాజు.. పెన్ అడిగి పాపను పడేసావే.. ఆహా
Also Read
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఇక తాజాగా హైపర్ ఆది యువశక్తి సభలో అన్న వ్యాఖ్యలపై రోజా మాట్లాడుతూ.. “పాపం చిన్న ఆర్టిస్టులు.. చిన్న చిన్న షోలు. పాత్రలు చేసుకొనేవారు.. వారిపై ఎందుకు ఈ ప్రతాపాలు.. వారి వెనుక ఎవరు ఉండి ఇవన్నీ అనిపిస్తున్నారో వారిని అనాలి. ఇలాంటి సభలో చిన్న చిన్న ఆర్టిస్టులను పిలిచి మాట్లాడించుకొనే పరిస్థితికి పవన్ దిగజారిపోయాడు. వారు కూడా మెగా కుటుంబంతో ఎక్కడ విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో వారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడి, వారి వెంటనే ఉంటామని చెప్పుకొస్తున్నారు. అది ప్రేమ కాదు భయం. ఎక్కడ మమ్మల్ని లేకుండా చేస్తారేమో అన్న భయంతో మాట్లాడుతున్నారు. ఇక వారు కూడా కొద్దిగా ఏం మాట్లాడుతున్నారో అర్ధం చేసుకుంటే బావుంటుంది. మంత్రులకు అసలు శాఖలే తెలియవు అని అంటే.. శాఖలు తెలియకుండానే మంత్రులు ఎలా అయ్యాం. సరే.. సినిమావాళ్ళు.. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శారద, నేను.. మమ్మల్ని గెలిపించిన జనం.. వారిని ఎందుకు గెలిపించలేకపోతున్నారు. ఎందుకంటే.. ప్రజలకు మేము ఎంతో కొంత మంచి చేశాం.. అది కనిపించి మమ్మల్ని గెలిపించారు. ప్రజలు ఏం తెలివితక్కువ వాళ్ళు కాదు.. వాళ్ళు చాలా తెలివైనవాళ్లు.. వారికి తెలుసు.. ఎవరు ఎలాంటివారో.. మనమేం చెప్పనవసరం లేదు” అంటూ రోజా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!