Minister Roja: హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: మినిస్టర్ రోజా.. జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఒకరి మీద ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువశక్తి సభలో పవన్.. రోజాను డైమండ్ రాణి అనడం, పవన్ అభిమాని హైపర్ ఆది.. మంత్రులకు శాఖలు కూడా తెలియదు అనడం రెండు తెలుగు రాష్ట్రాలను హీట్ ఎక్కించాయి. ఇక ఈ వ్యాఖ్యలపై రోజా సైతం ఘాటుగా స్పందిస్తూ.. పవన్ ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు వద్ద నుంచి కలక్షన్స్ తీసుకోవడానికి వెళ్లాడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా జగన్ ప్రభుత్వం మంచి చేసింది కాబట్టే తాము గెలిచామని, మరి ఇప్పటివరకు పవన్ ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలవలేదని ప్రశ్నించింది. ఇక నాగబాబు అన్న మాటలకు కూడా ఆమె తనదైన రీతిలో స్పందిస్తూ సమాధానం చెప్పుకొచ్చింది.
Dil Raju: ఏయ్.. ఏయ్.. దిల్ రాజు.. పెన్ అడిగి పాపను పడేసావే.. ఆహా
Also Read
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
ఇక తాజాగా హైపర్ ఆది యువశక్తి సభలో అన్న వ్యాఖ్యలపై రోజా మాట్లాడుతూ.. “పాపం చిన్న ఆర్టిస్టులు.. చిన్న చిన్న షోలు. పాత్రలు చేసుకొనేవారు.. వారిపై ఎందుకు ఈ ప్రతాపాలు.. వారి వెనుక ఎవరు ఉండి ఇవన్నీ అనిపిస్తున్నారో వారిని అనాలి. ఇలాంటి సభలో చిన్న చిన్న ఆర్టిస్టులను పిలిచి మాట్లాడించుకొనే పరిస్థితికి పవన్ దిగజారిపోయాడు. వారు కూడా మెగా కుటుంబంతో ఎక్కడ విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో వారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడి, వారి వెంటనే ఉంటామని చెప్పుకొస్తున్నారు. అది ప్రేమ కాదు భయం. ఎక్కడ మమ్మల్ని లేకుండా చేస్తారేమో అన్న భయంతో మాట్లాడుతున్నారు. ఇక వారు కూడా కొద్దిగా ఏం మాట్లాడుతున్నారో అర్ధం చేసుకుంటే బావుంటుంది. మంత్రులకు అసలు శాఖలే తెలియవు అని అంటే.. శాఖలు తెలియకుండానే మంత్రులు ఎలా అయ్యాం. సరే.. సినిమావాళ్ళు.. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శారద, నేను.. మమ్మల్ని గెలిపించిన జనం.. వారిని ఎందుకు గెలిపించలేకపోతున్నారు. ఎందుకంటే.. ప్రజలకు మేము ఎంతో కొంత మంచి చేశాం.. అది కనిపించి మమ్మల్ని గెలిపించారు. ప్రజలు ఏం తెలివితక్కువ వాళ్ళు కాదు.. వాళ్ళు చాలా తెలివైనవాళ్లు.. వారికి తెలుసు.. ఎవరు ఎలాంటివారో.. మనమేం చెప్పనవసరం లేదు” అంటూ రోజా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!