Minister Roja: హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: మినిస్టర్ రోజా.. జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఒకరి మీద ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువశక్తి సభలో పవన్.. రోజాను డైమండ్ రాణి అనడం, పవన్ అభిమాని హైపర్ ఆది.. మంత్రులకు శాఖలు కూడా తెలియదు అనడం రెండు తెలుగు రాష్ట్రాలను హీట్ ఎక్కించాయి. ఇక ఈ వ్యాఖ్యలపై రోజా సైతం ఘాటుగా స్పందిస్తూ.. పవన్ ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు వద్ద నుంచి కలక్షన్స్ తీసుకోవడానికి వెళ్లాడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా జగన్ ప్రభుత్వం మంచి చేసింది కాబట్టే తాము గెలిచామని, మరి ఇప్పటివరకు పవన్ ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలవలేదని ప్రశ్నించింది. ఇక నాగబాబు అన్న మాటలకు కూడా ఆమె తనదైన రీతిలో స్పందిస్తూ సమాధానం చెప్పుకొచ్చింది.
Dil Raju: ఏయ్.. ఏయ్.. దిల్ రాజు.. పెన్ అడిగి పాపను పడేసావే.. ఆహా
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఇక తాజాగా హైపర్ ఆది యువశక్తి సభలో అన్న వ్యాఖ్యలపై రోజా మాట్లాడుతూ.. “పాపం చిన్న ఆర్టిస్టులు.. చిన్న చిన్న షోలు. పాత్రలు చేసుకొనేవారు.. వారిపై ఎందుకు ఈ ప్రతాపాలు.. వారి వెనుక ఎవరు ఉండి ఇవన్నీ అనిపిస్తున్నారో వారిని అనాలి. ఇలాంటి సభలో చిన్న చిన్న ఆర్టిస్టులను పిలిచి మాట్లాడించుకొనే పరిస్థితికి పవన్ దిగజారిపోయాడు. వారు కూడా మెగా కుటుంబంతో ఎక్కడ విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో వారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడి, వారి వెంటనే ఉంటామని చెప్పుకొస్తున్నారు. అది ప్రేమ కాదు భయం. ఎక్కడ మమ్మల్ని లేకుండా చేస్తారేమో అన్న భయంతో మాట్లాడుతున్నారు. ఇక వారు కూడా కొద్దిగా ఏం మాట్లాడుతున్నారో అర్ధం చేసుకుంటే బావుంటుంది. మంత్రులకు అసలు శాఖలే తెలియవు అని అంటే.. శాఖలు తెలియకుండానే మంత్రులు ఎలా అయ్యాం. సరే.. సినిమావాళ్ళు.. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శారద, నేను.. మమ్మల్ని గెలిపించిన జనం.. వారిని ఎందుకు గెలిపించలేకపోతున్నారు. ఎందుకంటే.. ప్రజలకు మేము ఎంతో కొంత మంచి చేశాం.. అది కనిపించి మమ్మల్ని గెలిపించారు. ప్రజలు ఏం తెలివితక్కువ వాళ్ళు కాదు.. వాళ్ళు చాలా తెలివైనవాళ్లు.. వారికి తెలుసు.. ఎవరు ఎలాంటివారో.. మనమేం చెప్పనవసరం లేదు” అంటూ రోజా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!