Tirupathi: శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా సెల్ఫోన్ చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో మంత్రి హోదాలో శాప్పై మంత్రి రోజా తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే శాప్ సమావేశంలో రోజా సెల్ఫోన్స్ గురించి ప్రస్తావించిన సమయంలో.. ఆమె సెల్ఫోన్ చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కాగా మంత్రి రోజా సెల్ఫోన్ చోరీ చేసిన వ్యక్తి ఎవరన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
కాగా శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ను ముందుకు తీసుకువెళ్లాలనేది సీఎం జగన్ ఆలోచనగా ఉందని తెలిపారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా తెలిపారు. క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో యువతీ యువకులు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
జీవితంలో స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యమని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. సెల్ ఫోన్స్ వల్ల చాలామంది స్పోర్ట్స్కు దూరం అవుతున్నారన్నారు. పిల్లలు చిన్న విషయాలకు డిప్రెషన్ అవుతున్నారని.. వాళ్లు చాలా సెన్సిటివ్గా మారుతున్నారని తెలిపారు. స్పోర్ట్స్ ఆడటం వల్ల మానసిక స్థైర్యం వస్తుందని మంత్రి రోజా అన్నారు. ఫైర్ అనేది ఇన్ బిల్ట్ అని.. చెడు మీద ఫైర్ అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. తానెప్పుడూ సీఎం జగన్ను ఫాలో అవుతానని స్పష్టం చేశారు. మనం చేసే అభివృద్ధి పనులే మనల్ని విమర్శించే వాళ్లకు సమాధానం చెప్తాయని రోజా వ్యాఖ్యానించారు. అంతకుముందు తిరుపతి ఎస్వీయూ ఆవరణలోని వెంకటేశ్వరస్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి రోజాకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Andhra Pradesh: ఒంగోలు ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్పై సీఎం జగన్ సీరియస్
తాజావార్తలు
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!