RK Roja: పేదల కోసం పుట్టిన పార్టీ వైసీపీ.. మళ్ళీ మనదే అధికారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 ఏళ్ల ముందు వైఎస్ ఆశయాల మీద నాటిన పునాది వైసీపీ జెండా అన్నారు మంత్రి ఆర్ కె రోజా. అలుపెరకుండా శ్రమించిన ధీరుడు మన జగనన్న. ఈ 12 ఏళ్లలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ప్రజలకోసం పని చేస్తున్నారు. పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అన్నారు రోజా. 2024 ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. పార్టీని మరోసారి గెలిపించుకుని అధికారంలోకి తీసుకురావాలి. చంద్రబాబు వెబ్ సైట్ నుంచి మ్యానిఫెస్టో తీసేశాడు. కానీ మ్యానిఫెస్టోను భగవద్గీతలా భావించిన వ్యక్తి జగన్. నాయకుడంటే ఎలా ఉండకూడదో చంద్రబాబు ఒక ఉదాహరణ.
New Tyre Designs: కేంద్రం మరో కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి అమలు
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
నాయకుడంటే ఎలా ఉండాలో జగన్ ను చూసి నేర్చుకోవాలి. గెలిచిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబు. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చిన వ్యక్తి జగన్. ప్రజలను రాచి రంపాన పెట్టిన వ్యక్తి చంద్రబాబు. మేం అధికారంలోకి వస్తే వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసేస్తామని చెబుతున్నాడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు గురివింద సామెత గుర్తుచేస్తున్నారు. విచంద్రబాబు,పవన్ లకు రోజా సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే రండి…ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఢిల్లీలో చక్రం తిప్పానని చంద్రబాబు కబుర్లు చెబుతాడు. కానీ గల్లీలో కూడా గౌరవం దక్కక ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మీటింగ్ లకు జనాలు రావడం లేదు. చంద్రబాబు మమ్మల్ని చూసి భయపడుతున్నాడు. కరోనా సమయంలో ప్రజల కష్టాలు చంద్రబాబుకి గుర్తు రాలేదు. వైసీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ప్రతిపక్షాలు పారిపోవడం ఖాయం. ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుంది కాబట్టే కాలర్ ఎగరేసి మరీ ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం. చంద్రబాబులా జగన్ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును నమ్ముకున్నందుకు కార్యకర్తలకైనా బుర్ర ఉండాలి.
చంద్రబాబు అనే చీడ పురుగును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి. అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ తో పాటు అందరి కాళ్లూ పట్టుకుంటున్నాడని విమర్శించారు రోజా. ఒకరు రెండు చోట్ల ఓడిపోయారు. కానీ జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తానంటాడు. మరొకరేమో సొంత కొడుకునే గెలిపించుకోలేని అసమర్ధుడు. 2024లో మళ్లీ జగన్ ను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు మంత్రి రోజా.
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!