Minister RK Roja: పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటే, జగన్కు సైన్యముంది.. మంత్రి రోజా కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja Counter To Pawan Kalyan: ఏపీ మంత్రి రోజా మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. పవన్కు ఫ్యాన్స్ ఉంటే, జగన్కు సైన్యముందని అన్నారు. పవన్ పిచ్చాసుపత్రి నుండి పారిపోయిన వ్యక్తిలాంటి వాడని విమర్శించారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని పవన్కు జగన్ను విమర్శించే స్థాయి లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టుకొలేని పార్టీ జనసేన పార్టీ అని ఎద్దేవా చేశారు. 2024లో ప్రజలందరూ జగనన్న క్రీడా సంబరాలల్లో ఆడుకుంటే.. పవన్, చంద్రబాబులతో సీఎం జగన్ ఆడుకుంటారని పేర్కొన్నారు.
Pawan kalyan: రేణు దేశాయ్ ఫోటో షేర్ చేసిన పవన్.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఫిదా చేశాడే
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
అంతకుముందు కూడా.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి రోజా తిప్పికొట్టారు. కరోనా టైమ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుంటే.. ఇక్కడ ప్రజలకు సేవలందించింది వాలంటీర్లేనని చెప్పారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలకు విజిల్స్, చప్పట్లు కొడుతున్న పవన్ అనుచరులు సైతం.. వాలంటీర్ల సేవలు అందుకున్న వారేనన్నారు గుర్తు చేశారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలాగా పవన్ పిచ్చిగంతులు వేస్తున్నారని మండిపడ్డారు. అసలు పవన్ తల్లి, పెళ్లాం గురించి ఎవరు తప్పుగా మాట్లాడారని ప్రశ్నించారు. పవన్ నీతులు చెబుతుంటే.. సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంస్కారం గురించి మాట్లాడే అర్హత పవన్కి ఎక్కడిదని అడిగారు. పవన్ పనికిమాలినోడని, ఆయన మాటలు వింటే లాగిపెట్టి కొట్టాలనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: ఏపీలో బలమైన మార్పు తేవాలి.. జనసేనని ఎవరు అడ్డుకుంటారో చూద్దాం
గతంలో చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీలతో అర్హులకు అన్యాయం చేసిందని.. అప్పుడు పవన్ పవన్ ఏమైపోయారని మంత్రి రోజా ప్రశ్నించారు. అప్పుడు పవన్ తన నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కు సచివాలయ వ్యవస్థ గురించి తెలియదని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్కి వచ్చని ఎద్దేవా చేశారు. ఇకనైనా పవన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేస్తే మంచిదని హితవు పలికారు. పవన్కు దమ్ముంటే.. 175 స్థానాల్లో జనసేన నుంచి సింగిల్గా క్యాండెట్ని పెట్టి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!