PeddiReddy: ఏపీలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రానివ్వకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister PeddiReddy Ramachandra Reddy: ఏపీలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఎటువంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఇంధన, గనులు, ఎపిఎండిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఇడిసిఎపి రూపొందించిన హ్యాండ్ బుక్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో పాటు విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతులు చేసుకుంటున్నామన్నారు.
ఏపీఎండీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గురంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశీయంగా లభించే బొగ్గును మన రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ఏపీఎండీసీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల నిర్వహణకు సిద్ధంగా ఉందని, ఇప్పటికే మధ్యప్రదేశ్లో సుల్యారీ గనిని నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్లో ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని గనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకవైపు బొగ్గు ఉత్పత్తిపై ఏపీఎండీసీ దృష్టి సారించాలని, అలాగే రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందించేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని, ఇంధన, గనులశాఖ అధికారులు దీనిపై సంయుక్తంగా ముందుకు సాగాలని సూచించారు.
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
Read Also: బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే..?
ఇంధనశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించాలని, హేతుబద్ధంగా అవసరమైన పోస్టులను భర్తీ చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఇంధన శాఖలో కూడా పునర్ వ్యవస్థీకరణ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు వ్యవసాయ కనెక్షన్ లను ఇవ్వడంలో ఎటువంటి అలసత్వంను సహించేంది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ కనెక్షన్లను జారీ చేసే విషయంలో ఎటువంటి జాప్యం చేయకూడదని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. అలాగే వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా నిర్ణీత లక్ష్యంలోగా పూర్తి చేయాలని సూచించారు. మీటర్ల వల్ల రైతులపై ఎటువంటి భారం పడదని, కావాలని విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. వ్యవసాయానికి నికరంగా ఎంత విద్యుత్ వాడుతున్నారో మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల తెలుస్తుందన్నారు. ఉచితంగా క్వాలిటీ విద్యుత్ను వ్యవసాయానికి అందించడానికి మరింత వీలవుతుందన్నారు. ఇంధనశాఖ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించే విషయంలో అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. లీగల్ విభాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈ కేసులను పరిష్కరం కోసం కృషి చేయాలని కోరారు.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!