PeddiReddy Ramachandra Reddy: ఏపీలో పులుల సంపద ఎక్కువగానే ఉంది.. కానీ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PeddiReddy Ramachandra Reddy: తిరుపతిలోని ఎస్వీ జంతు ప్రదర్శన శాలలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన పులుల ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రిపెద్దిరెడ్డి తిలకించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ బ్రోచర్స్, వెబ్ సైట్ను విడుదల చేశారు. అనంతరం ఉద్యోగంలో ప్రతిభ కనబర్చిన పలువురు అటవీ శాఖ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. రష్యాలో టైగర్ సదస్సు 2010లో జరిగిందని.. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్- శ్రీశైలం మధ్య ఉందని తెలిపారు.
Read Also: Ravela Kishore Babu : ఆ మాజీ మంత్రికి కాలం కలిసిరావడం లేదా..? ఎన్నో ఆశలు పెట్టుకున్నారా..?
Also Read
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
2018 కంటే ఇప్పుడు 60 శాతం పులులు పెరిగాయని.. దాదాపు సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వులో 64 పులులు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. శేషాచలంను కారిడార్గా చేసుకుని పులులు సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. పాపికొండలు వైపు కూడా పులులు సంచరిస్తున్నాయని తెలిపారు. దాదాపుగా 75 పులులు రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు లెక్కలు ఉన్నాయన్నారు. గతంలో కేవలం ఫుట్ ప్రింట్స్ ఆధారంగా పులులు గణాంకాలు జరిగేవని.. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందని.. అవసరమైన టెక్నాలజీని ఎప్పటికప్పుడు వినియోగిస్తూ పులుల వృద్ధికి, సంరక్షణకు కృషి చేయాలని అధికారులను కోరుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కృష్ణ జింకలు లాంటి జంతువుల సంఖ్య అసాధారణంగా పెరగకుండా పులులు మనకు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో పులుల సంపద ఎక్కువగా ఉందని చెప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. పులుల సంఖ్య మరింత వృద్ధి చెందేలా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..