PeddiReddy Ramachandra Reddy: ఏపీలో పులుల సంపద ఎక్కువగానే ఉంది.. కానీ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PeddiReddy Ramachandra Reddy: తిరుపతిలోని ఎస్వీ జంతు ప్రదర్శన శాలలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన పులుల ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రిపెద్దిరెడ్డి తిలకించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ బ్రోచర్స్, వెబ్ సైట్ను విడుదల చేశారు. అనంతరం ఉద్యోగంలో ప్రతిభ కనబర్చిన పలువురు అటవీ శాఖ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. రష్యాలో టైగర్ సదస్సు 2010లో జరిగిందని.. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్- శ్రీశైలం మధ్య ఉందని తెలిపారు.
Read Also: Ravela Kishore Babu : ఆ మాజీ మంత్రికి కాలం కలిసిరావడం లేదా..? ఎన్నో ఆశలు పెట్టుకున్నారా..?
Also Read
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
2018 కంటే ఇప్పుడు 60 శాతం పులులు పెరిగాయని.. దాదాపు సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వులో 64 పులులు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. శేషాచలంను కారిడార్గా చేసుకుని పులులు సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. పాపికొండలు వైపు కూడా పులులు సంచరిస్తున్నాయని తెలిపారు. దాదాపుగా 75 పులులు రాష్ట్రంలో సంచరిస్తున్నట్లు లెక్కలు ఉన్నాయన్నారు. గతంలో కేవలం ఫుట్ ప్రింట్స్ ఆధారంగా పులులు గణాంకాలు జరిగేవని.. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందని.. అవసరమైన టెక్నాలజీని ఎప్పటికప్పుడు వినియోగిస్తూ పులుల వృద్ధికి, సంరక్షణకు కృషి చేయాలని అధికారులను కోరుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. కృష్ణ జింకలు లాంటి జంతువుల సంఖ్య అసాధారణంగా పెరగకుండా పులులు మనకు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో పులుల సంపద ఎక్కువగా ఉందని చెప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. పులుల సంఖ్య మరింత వృద్ధి చెందేలా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!