Minister Peddireddy: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్.. రౌడీయిజం మీదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆయనపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి.. మైనింగ్ మాఫియాకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు.. అసలు రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.. ఇక, కుప్పంలో రౌడీయిజం చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులేనని ఆరోపించిన ఆయన.. కుప్పంలో జరుగుతున్న మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.. గతం ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు.
Read Also: Heavy Floods: మహాప్రభో మమ్మల్ని కాపాడండీ.. ఇంటెక్ వెల్ కార్మికులు
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
కుప్పంలో వైసీపీ రౌడీయిజం చేస్తే.. చంద్రబాబు విజయం సాధించలేడని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి… చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 మంది మైనింగ్ లీజు దారులపై 114 కోట్లు జరిమాన విధించామన్న ఆయన.. కుప్పంలో మైనింగ్ చేస్తూంది టీడీపీ వాళ్లే అని ఆరోపించారు.. ఇక, మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా ఫొటోలు తీసి పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా చంద్రబాబు హయంలో జరిగిందని దుయ్యబట్టిన ఆయన.. 75 ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు హయంలో మైనింగ్ కి సంబంధించి కేంద్రం ఎప్పుడైనా అవార్డులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.. మూడు సంవత్సరాలలో మా ప్రభుత్వానికి రెండు సార్లు అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ఇక, కుప్పంని దుష్టిలో ఉంచుకొనే చంద్రబాబు.. అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
TheyCallHimOG2 : OG -2.. నిర్మాణ భాద్యతలు ఆ రెండు సంస్థలకు?
-
చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!