Minister Peddireddy: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్.. రౌడీయిజం మీదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆయనపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి.. మైనింగ్ మాఫియాకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు.. అసలు రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.. ఇక, కుప్పంలో రౌడీయిజం చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులేనని ఆరోపించిన ఆయన.. కుప్పంలో జరుగుతున్న మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.. గతం ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు.
Read Also: Heavy Floods: మహాప్రభో మమ్మల్ని కాపాడండీ.. ఇంటెక్ వెల్ కార్మికులు
Also Read
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- OTR: నిడదవోలు కూటమిలో కొరకరాని కొయ్యలా బూరుగుపల్లి
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
కుప్పంలో వైసీపీ రౌడీయిజం చేస్తే.. చంద్రబాబు విజయం సాధించలేడని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి… చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 మంది మైనింగ్ లీజు దారులపై 114 కోట్లు జరిమాన విధించామన్న ఆయన.. కుప్పంలో మైనింగ్ చేస్తూంది టీడీపీ వాళ్లే అని ఆరోపించారు.. ఇక, మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా ఫొటోలు తీసి పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా చంద్రబాబు హయంలో జరిగిందని దుయ్యబట్టిన ఆయన.. 75 ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు హయంలో మైనింగ్ కి సంబంధించి కేంద్రం ఎప్పుడైనా అవార్డులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.. మూడు సంవత్సరాలలో మా ప్రభుత్వానికి రెండు సార్లు అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ఇక, కుప్పంని దుష్టిలో ఉంచుకొనే చంద్రబాబు.. అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!