Minister Peddireddy: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్.. రౌడీయిజం మీదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆయనపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి.. మైనింగ్ మాఫియాకు పాల్పడింది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు.. అసలు రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు.. ఇక, కుప్పంలో రౌడీయిజం చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులేనని ఆరోపించిన ఆయన.. కుప్పంలో జరుగుతున్న మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిషికొండలో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.. గతం ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు.
Read Also: Heavy Floods: మహాప్రభో మమ్మల్ని కాపాడండీ.. ఇంటెక్ వెల్ కార్మికులు
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
కుప్పంలో వైసీపీ రౌడీయిజం చేస్తే.. చంద్రబాబు విజయం సాధించలేడని హెచ్చరించారు మంత్రి పెద్దిరెడ్డి… చంద్రబాబు ఆరోపణలు చేసిన తర్వాత 43 మంది మైనింగ్ లీజు దారులపై 114 కోట్లు జరిమాన విధించామన్న ఆయన.. కుప్పంలో మైనింగ్ చేస్తూంది టీడీపీ వాళ్లే అని ఆరోపించారు.. ఇక, మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా ఫొటోలు తీసి పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా చంద్రబాబు హయంలో జరిగిందని దుయ్యబట్టిన ఆయన.. 75 ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చంద్రబాబు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు హయంలో మైనింగ్ కి సంబంధించి కేంద్రం ఎప్పుడైనా అవార్డులు ఇచ్చిందా? అని ప్రశ్నించారు.. మూడు సంవత్సరాలలో మా ప్రభుత్వానికి రెండు సార్లు అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ఇక, కుప్పంని దుష్టిలో ఉంచుకొనే చంద్రబాబు.. అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?