Peddireddy Ramachandrareddy: చంద్రబాబుకి మంత్రి పెద్దిరెడ్డి సవాల్
ఏపీలో వైసీపీ టీడీపీ నేతల సవాళ్ళు ప్రతి సవాళ్ళు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఎన్టీవీతో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో 97, 98 శాతం ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. వచ్చే రెండేళ్లలో ఏం చేస్తారన్నది ముఖ్యమంత్రి చెబుతారు. నా రికార్డులను బ్రేక్ చేశారని గోబెల్స్ బాధపడి ఉండేవాడు. కుప్పాన్ని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.
జిల్లాకు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు నేనే కనిపిస్తాను. రాజంపేట ఎవరి జాగీరో చంద్రబాబుకు తెలియదా??రాజంపేట నుంచి నా గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత ఎక్కువగా దెబ్బ తింటుంది. నేను, నా కుటుంబం అవినీతికి పాల్పడుతున్నాం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. కాదని తేలితే చంద్రబాబు గుండు కొట్టించుకుంటాడా అని ఆయన ఛాలెంజ్ విసిరారు. ఈసారి ఎలాగైనా కుప్పంలో గెలవాలని పట్టుదలతో ఉన్నాం. కుప్పంలో పోటీ చేసే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ ప్లీనరీ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కుప్పం గడ్డపై వైసీపీ జెండా ఎగరేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గం మార్చేస్తారా? లేక ఇజ్జత్ కా సవాల్ అని కుప్పంలో గెలవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
మరోవైపు మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఇది ప్రజల యొక్క ప్లీనరీ. ఎవరింటికి వెళ్ళినా జగన్ పేరు తప్పా మరోకటి వినిపించటం లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చి ఉండేదా అన్నప్పుడే చంద్రబాబు మతి భ్రమించిన విషయం అందరికి అర్థం అయ్యింది. చంద్రబాబు కన్నెర్ర చేసే మనిషి కాబట్టి ప్రజా కోర్టులో శిక్షించారన్నారు మంత్రి నారాయణస్వామి.
Lalu Prasad Yadav: ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ.. సింగపూర్ కు తరలించే అవకాశం
తాజావార్తలు
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
-
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!