Peddireddy Ramachandrareddy: చంద్రబాబుకి మంత్రి పెద్దిరెడ్డి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ టీడీపీ నేతల సవాళ్ళు ప్రతి సవాళ్ళు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఎన్టీవీతో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో 97, 98 శాతం ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. వచ్చే రెండేళ్లలో ఏం చేస్తారన్నది ముఖ్యమంత్రి చెబుతారు. నా రికార్డులను బ్రేక్ చేశారని గోబెల్స్ బాధపడి ఉండేవాడు. కుప్పాన్ని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.
జిల్లాకు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు నేనే కనిపిస్తాను. రాజంపేట ఎవరి జాగీరో చంద్రబాబుకు తెలియదా??రాజంపేట నుంచి నా గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత ఎక్కువగా దెబ్బ తింటుంది. నేను, నా కుటుంబం అవినీతికి పాల్పడుతున్నాం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. కాదని తేలితే చంద్రబాబు గుండు కొట్టించుకుంటాడా అని ఆయన ఛాలెంజ్ విసిరారు. ఈసారి ఎలాగైనా కుప్పంలో గెలవాలని పట్టుదలతో ఉన్నాం. కుప్పంలో పోటీ చేసే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ ప్లీనరీ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కుప్పం గడ్డపై వైసీపీ జెండా ఎగరేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గం మార్చేస్తారా? లేక ఇజ్జత్ కా సవాల్ అని కుప్పంలో గెలవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
మరోవైపు మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఇది ప్రజల యొక్క ప్లీనరీ. ఎవరింటికి వెళ్ళినా జగన్ పేరు తప్పా మరోకటి వినిపించటం లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చి ఉండేదా అన్నప్పుడే చంద్రబాబు మతి భ్రమించిన విషయం అందరికి అర్థం అయ్యింది. చంద్రబాబు కన్నెర్ర చేసే మనిషి కాబట్టి ప్రజా కోర్టులో శిక్షించారన్నారు మంత్రి నారాయణస్వామి.
Lalu Prasad Yadav: ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ.. సింగపూర్ కు తరలించే అవకాశం
తాజావార్తలు
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!