Peddireddy Ramachandrareddy: చంద్రబాబుకి మంత్రి పెద్దిరెడ్డి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వైసీపీ టీడీపీ నేతల సవాళ్ళు ప్రతి సవాళ్ళు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఎన్టీవీతో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో 97, 98 శాతం ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. వచ్చే రెండేళ్లలో ఏం చేస్తారన్నది ముఖ్యమంత్రి చెబుతారు. నా రికార్డులను బ్రేక్ చేశారని గోబెల్స్ బాధపడి ఉండేవాడు. కుప్పాన్ని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి.
జిల్లాకు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు నేనే కనిపిస్తాను. రాజంపేట ఎవరి జాగీరో చంద్రబాబుకు తెలియదా??రాజంపేట నుంచి నా గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే టీడీపీ అంత ఎక్కువగా దెబ్బ తింటుంది. నేను, నా కుటుంబం అవినీతికి పాల్పడుతున్నాం అని నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. కాదని తేలితే చంద్రబాబు గుండు కొట్టించుకుంటాడా అని ఆయన ఛాలెంజ్ విసిరారు. ఈసారి ఎలాగైనా కుప్పంలో గెలవాలని పట్టుదలతో ఉన్నాం. కుప్పంలో పోటీ చేసే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ ప్లీనరీ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కుప్పం గడ్డపై వైసీపీ జెండా ఎగరేయాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గం మార్చేస్తారా? లేక ఇజ్జత్ కా సవాల్ అని కుప్పంలో గెలవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
మరోవైపు మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. ఇది ప్రజల యొక్క ప్లీనరీ. ఎవరింటికి వెళ్ళినా జగన్ పేరు తప్పా మరోకటి వినిపించటం లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చి ఉండేదా అన్నప్పుడే చంద్రబాబు మతి భ్రమించిన విషయం అందరికి అర్థం అయ్యింది. చంద్రబాబు కన్నెర్ర చేసే మనిషి కాబట్టి ప్రజా కోర్టులో శిక్షించారన్నారు మంత్రి నారాయణస్వామి.
Lalu Prasad Yadav: ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ.. సింగపూర్ కు తరలించే అవకాశం
తాజావార్తలు
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!