Nadendla Manohar: రేషన్ మాఫియాకు మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్.. ఇక అరెస్టులే..!
- రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు చేస్తాం..
- 6ఏ కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశాం..
- రేషన్ మాఫియాలో జరిగిన అవినీతిపై సీఐడీతో విచారణ చేయిస్తాం: మంత్రి నాదెండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: త్వరలోనే 41 A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేసిన వారి అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇప్పటికే 6A కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కాకినాడను అడ్డాగా మార్చుకుని ఊహించని విధంగా గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు జరిగిందని వెల్లడించారు. ఒక కుటుంబం కనుసన్నల్లో పోర్ట్ నడిచిందని ఆరోపించారు. అక్రమ సరఫరా ఆగాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అవసరం అయితే మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు.
Read Also: Rajasthan Shocker: భార్యకు ఘోరమైన శిక్ష.. బైకుకి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త..
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ముఖ్యమంత్రితో చర్చించి రేషన్ మాఫియాలో సీఐడీని ఇన్వాల్వ్ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారం చేసుకుంటామంటే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్ట్ నుంచి 400 ఎకరాలకు ప్రభుత్వానికి రూ. 40 కోట్లు ఆదాయం మాత్రమే వస్తుందన్నారు. చెక్ పోస్ట్ల ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పోర్టు ఏ ఒక్క కుటుంబానిది కాదన్నారు. లారీలు వెయిట్ చేయకుండా మరొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. చెక్ పోస్ట్లలో మూడు షిఫ్ట్లలో ఉద్యోగులు ఉంటారన్నారు. కాకినాడ పోర్టును రేషన్ మాఫియాకు అడ్డాగా మార్చారని ఆగ్రహించారు. త్వరలోనే అరెస్టులు ఉంటాయని ఆయన చెప్పారు. చట్ట ప్రకారం ప్రొసెస్ జరుగుతుందని.. సీఎం, క్యాబినెట్లో చర్చించి రేషన్ మాఫియాలో సీఐడీ విచారణ చేస్తామన్నారు. వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ మాఫియా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోర్టులో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడడమే మా బాధ్యత అని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!