Minister Merugu Nagarjuna: చంద్రబాబు ముక్కు నేలకు రాయాలి.. లేదంటే లోకేష్ యాత్రను అడ్డుకుంటాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేశారు మంత్రి మేరుగ నాగార్జున… ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చంద్రబాబు అన్నారని మండిపడ్డారు.. దీనిపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద చంద్రబాబు ముక్కు నేలకేసి రాయాలి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. లేదంటే నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటామని హెచ్చరించారు.. ఇక, వంగవీటి మోహన రంగా హత్య కేసులో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని సంచలన ఆరోపణలు చేశారు.. మరోవైపు, అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు.
Read Also: Chandrababu: రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోంది..!
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ఇక, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే దమ్మున్న రాజకీయం చేయాలని సలహా ఇచ్చారు మంత్రి మేరుగ నాగార్జున.. పవన్ బస్సు యాత్ర ఎవరి కోసం చేస్తున్నాడు..? అని నిలదీసిన ఆయన.. సమాధానం చెప్పలేనివాళ్లు యాత్రల పేరుతో వస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఎవరు ఏం చేసినా.. 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్కు దిగారు మంత్రి.. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ ప్రభుత్వంలో అయినా పవన్ కల్యాణ్.. ఇలాంటి కాలనీలు చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారో పవన్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ వాళ్ల కోసం ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసిన ఆయన.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అభివృద్ధికి ఉపయోగపడే వారు.. నరేంద్ర మోడీయా? అమిత్ షానా? అనేది తమకు అనవసం.. రాష్ట్ర అభివృద్దే ముఖ్యమని ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!