Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Meruga Nagarjuna Slams Chandrababu

Meruga Nagarjuna: చంద్రబాబుకు మతి భ్రమించింది.. వాళ్ల పాదయాత్రలో రైతులు ఎక్కడున్నారు?

Published Date :September 10, 2022 , 6:31 pm
By Ramesh Nalam
Meruga Nagarjuna: చంద్రబాబుకు మతి భ్రమించింది.. వాళ్ల పాదయాత్రలో రైతులు ఎక్కడున్నారు?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని.. ఆయనకు జబ్బుతో పాటు వయసు కూడా సహకరించడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్‌ తమపై అసభ్యపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. లోకేష్‌కు 40 ఏళ్లు కూడా ఉండవని.. ఆయనకు తాము కొడుకులం ఎలా అవుతామని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. లోకేష్ ఒక లుచ్చా అని.. ఆవు చేలో మేస్తే.. దూడ కూడా చేలోనే మేస్తుందని.. చంద్రబాబు గడ్డి తింటున్నారు కాబట్టి ఆయన కొడుకు కూడా గట్టి తింటున్నాడని ఫైర్ అయ్యారు. తమకు సంస్కారం ఉంది కాబట్టి చంద్రబాబును ఆ మాట అనటం లేదన్నారు. తాము అంతకన్నా భాష తెలిసిన వాళ్లమేనని.. నాలుగు రెట్లు చంద్రబాబు కన్నా బూతులు తిట్టగలమన్నారు.

Read Also: Ram Charan: కొత్త లుక్‌లో అదరగొడుతున్న చెర్రీ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

Also Read

  • AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
  • TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
  • MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
  • Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
Add as a preferred
source on google

చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకోలేక పోతే రాబోయే ఎన్నికల్లో సరిగ్గా పర్యటనలు చేయలేరని మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. టీడీపీ నేతలు తమను రాజీనామాలు చేయమని మాట్లాడుతున్నారు అని.. రాజీనామాలు చేయాల్సిన పని తమకు లేదన్నారు. ప్రజలకు తమకు మాండేటరీ మెజారిటీ ఇచ్చి ఎన్నికల్లో గెలిపించారన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా ఐదేళ్లు పరిపాలన చేస్తామని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తామని.. అప్పుడు చంద్రబాబు దమ్ముంటే తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాజధాని ప్రాంతంలో చేసే పాదయాత్రలో రైతులు ఎక్కడ ఉన్నారని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు బతకకుండా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో పాదయాత్ర చేసేవాళ్లు ఎక్కడికి నడుస్తున్నారు, ఏం సాధిస్తారో చెప్పాలన్నారు. రాజధాని అనేది ఎవరికి ఉపయోగమో త్వరలో తెలుస్తుందన్నారు.

మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా కూడా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కాకినాడలో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలను దుష్ట చతుష్టయం మోసం చేస్తుందన్నారు. తొండంగి మండలం ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్‌ను స్ధానిక మత్స్యకారులు, హేచరీ యాజమానులు స్వాగతిస్తున్నారని.. కానీ ఈ ప్రాజెక్ట్ అడ్డుకునేందుకు చంద్రబాబు యనమలతో లేఖ రాయించి కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో వర్షాలు వచ్చినా.. పరిశ్రమలు వచ్చినా దుష్ట చతుష్టయానికి ఏడుపులే అని చురకలు అంటించారు. కరోనా వచ్చినా ఏపీ డబుల్ డిజిట్ గ్రోత్‌లో ఉందని స్పష్టం చేశారు. పచ్చ మీడియా ఈ విషయాన్ని రాయదన్నారు. ఏ హక్కు ఉందని చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌ను తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం చేస్తున్న అన్యాయాలను, బ్లాక్ మెయిలింగ్‌ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేష్‌లకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • chandrababu
  • meruga nagarjuna
  • Telugu Desam Party
  • YSRCP

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions