Meruga Nagarjuna: దగా చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.. ఆయన శకం ముగిసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Meruga Nagarjuna Fires On Chandrababu Naidu: ఎస్సీ, ఎస్టీలను దగా చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఇప్పుడు ఆయన శకం ముగిసిందని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. టీడీపీ ఒక అహంకార పార్టీ అని, రాజ్యాంగబద్దంగా వచ్చిన హక్కులను హరించటం వారికి అలవాటు అయ్యిందని ఆరోపించారు. తన హయాంలో చంద్రబాబు దళితులకు ఒక్క మంచి పని కూడా చేయలేదని, టీడీపీ దళిత వ్యతిరేక పార్టీ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియా సైతం దళిత వ్యతిరేకులేనని మండిపడ్డారు.
CPI Ramakrishna: రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది.. అభివృద్ధి ఎక్కడా జరగలేదు
Also Read
- Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
- Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
- KGBV జాబ్స్.. 299 పోస్టులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే దరఖాస్తులు.!
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను, అమరావతి ప్రాంతంలో దళితులకు భూమి ఇస్తామంటే.. వాళ్లు వ్యతిరేకిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దళితులకు ఒక్క మంచి పని కూడా చేయని చంద్రబాబు.. అంబేద్కర్ విగ్రహాన్ని కడతామని చెప్పి, ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. దళితులు గౌరవంతో తలెత్తుకునేలా తమ నాయకుడు జగన్ చేస్తున్నారని.. శాచురేషన్ విధానంలో దళితులకు, పేదలకు సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు చెప్పలేదా? బీసీ కులాల తోకలు కత్తిరిస్తానని అహంకారం ప్రదర్శించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంబేద్కర్ చెప్పిన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ పాలన సాగుతోందని.. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న ప్రతీ పైసాను తమ ప్రభుత్వం దళితుల కోసం ఖర్చు చేస్తోందని అన్నారు.
A Strange Case: భర్తపై భార్య అత్యాచారం.. 29 గంటలపాటు ఏకధాటిగా
తమ వర్గాలకు చంద్రబాబు చేసిన మోసాలు.. ఇంకా తమ గుండెల్లో గునపాల్లా గుచ్చుకుంటూనే ఉన్నారని మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సంక్షేమానికి, అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా జగన్ పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విదేశీ విద్యలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని.. ఎస్సీ కార్పొరేషన్కు వాహనాల కొనుగోళ్ళల్లో అవకతవకల అంశాన్ని సైతం సీఐడీకి అప్పగించామని పేర్కొన్నారు. రూ. 48 కోట్లు అడ్వాన్స్ రూపంలో ప్రభుత్వం చెల్లించినా.. వాహనాలు డెలివరీ అవ్వలేదని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Xiaomi Mijia: మార్కెట్ లోకి విద్యుత్ ఆదా చేసే కొత్త ఏసీ.. 3 నిమిషాల్లో అదిరిపోయే కూలింగ్! ధర ఎంతో తెలుసా ?
-
Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
-
Elon Musk: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. పెంటగాన్ను పీల్చి పిప్పి చేస్తున్న స్పేస్ఎక్స్!
-
BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
-
US-Iran: తాజా దాడులతో శాంతి చర్చలపై నీలినీడలు.. రగిలిపోతున్న ఇరాన్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!