CPI Ramakrishna: రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది.. అభివృద్ధి ఎక్కడా జరగలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna Fires On YSRCP Govt: రాష్ట్రం ప్రభుత్వం దివాలా తీసింది.. అభివృద్ధి పని ఎక్కడా జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నూలులోని కోడుమూరులో నిర్వహించిన రైతు రక్షణ పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒక్క సాగునీటీ ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్ట్ల ఊసేలేదని మండిపడ్డారు. హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని చెప్పి.. చివరికి అందులో నీళ్లు లేకుండా చేశారని చెప్పారు. గాలేరు నగరిని గాలికి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ambati Rambabu: పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్.. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నప్పటికీ, కాల్వలు లేవని రామకృష్ణ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేస్తే.. 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, నకిలీ విత్తనాల వల్లే రైతులు నష్టపోయారని శాస్త్రవేత్తలు తేల్చారని వెల్లడించారు. పంట నష్టపోతే.. ఒక మంత్రి గానీ, ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీకి సీడ్ కంపెనీ ఉందని.. ఆయనే రింగ్ లీడరని ఆరోపించారు. సిగ్గులేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఇద్దరు మంత్రులున్నా.. ఏనాడూ రైతుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవని ఫైర్ అయ్యారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Shraddha Walker Like Incident: శ్రద్ధా వాకర్ తరహాలో మరో ఘటన.. మహిళను చంపి, 50 ముక్కలు చేసి..
రైతుల సమస్యలపై తమ పార్టీ నిరంతరం పోరాట చేస్తుందని, కర్నూలు జిల్లాలో ఇప్పటికే తమ పార్టీకి చెందిన 4 బృందాలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నాయని రామకృష్ణ తెలిపారు. సీఎం జగన్ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కాకుండా.. పొలం పొలానికి వెళ్తే రైతుల పంట నష్టాలు, కష్టాలు తెలుస్తాయని సూచించారు. నకిలీ విత్తనాల అమ్మకాల్లో వైసీపీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయని.. ఆయన పాత్రపై విచారణ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!