Minister Kottu Satyanarayana: ప్రధాన ఆలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతురులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పండితులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉందన్నారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పట్నుంచో ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఆన్లైన్ ప్రక్రియపై దృష్టి పెడుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
దేవాదాయ శాఖకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని.. సమస్యల పరిష్కారానికి ప్రతివారం సమీక్షలు జరుపుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కమిటీలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ధార్మిక పరిషత్తో పాటు మరికొన్ని కమిటీలు ఉన్నాయని.. సీజీఎఫ్కు సంబంధించి కొంత మంది సభ్యుల నియామకం కావాల్సి ఉందన్నారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. సీజీఎఫ్కు సంబంధించి కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
కొన్ని నియామకాలు కూడా చేస్తున్నామన్నారు. సీజీఎఫ్ పురోగతిపై ప్రతినెలా సమీక్ష ఉంటుందన్నారు. న్యాయ పరమైన అంశాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయన్నారు. దాదాపు ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అదనపు న్యాయ సలహాదారు పోస్ట్ కోసం ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో అవినీతి లేదని చెప్పలేమని.. అవినీతిని అరికట్టడానికి విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయంలో మాస్టర్ ప్లాన్కు సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు. కనక దుర్గ గుడిని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నామని తెలిపారు. ప్రతి దేవాలయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని దేవాలయాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!