Minister Kottu Satyanarayana: ప్రధాన ఆలయాల్లో బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతురులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పండితులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉందన్నారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పట్నుంచో ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఆన్లైన్ ప్రక్రియపై దృష్టి పెడుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
దేవాదాయ శాఖకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని.. సమస్యల పరిష్కారానికి ప్రతివారం సమీక్షలు జరుపుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కమిటీలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ధార్మిక పరిషత్తో పాటు మరికొన్ని కమిటీలు ఉన్నాయని.. సీజీఎఫ్కు సంబంధించి కొంత మంది సభ్యుల నియామకం కావాల్సి ఉందన్నారు. ఎండోమెంట్ ట్రిబ్యునల్కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. సీజీఎఫ్కు సంబంధించి కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
Also Read
కొన్ని నియామకాలు కూడా చేస్తున్నామన్నారు. సీజీఎఫ్ పురోగతిపై ప్రతినెలా సమీక్ష ఉంటుందన్నారు. న్యాయ పరమైన అంశాలు కొన్ని పెండింగ్లో ఉన్నాయన్నారు. దాదాపు ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అదనపు న్యాయ సలహాదారు పోస్ట్ కోసం ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో అవినీతి లేదని చెప్పలేమని.. అవినీతిని అరికట్టడానికి విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయంలో మాస్టర్ ప్లాన్కు సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు. కనక దుర్గ గుడిని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నామని తెలిపారు. ప్రతి దేవాలయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని దేవాలయాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..