Minister Jogi Ramesh : ఓటు వేయటానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు, పవన్ కల్యాణ్పై మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. పేదలకు ఇస్తున్న సెంటు స్థలంలో సమాధులు కట్టుకోవాలని చంద్రబాబు అనడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా?అమరావతిలో రాజధాని కడితే పేదవాళ్లు అక్కడ ఉండకూడదా?.. పవన్, చంద్రబాబు పార్టీలను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబును రాజకీయ సమాధి చేయడానికి వైసీపీ రెడీగా ఉంది అని మంత్రి జోగిరమేష్ అన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికి పవన్ ఉన్నారా? చేతకాక సీఎం పదవి వద్దని పవన్ అంటున్నారు అని మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు.
Also Read : NTR: మరోసారి విలన్ గా ఎన్టీఆర్.. ఏ సినిమాలో అంటే..?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
చంద్రబాబు మంచి నీళ్ళు తాగి మాట్లాడాడా లేకపోతే అయ్యన్న పాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి మాట్లాడాడా.. అంటూ మంత్రి జోగి రమేష్ అన్నారు. మూడు సెంట్ల భూమి ఇచ్చానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పాడు అని మండిపడ్డారు. 31 లక్షల మంది పేద వర్గాలకు ఇళ్ళు సిద్ధం అవుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు చేయడం బాధకరమని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు రాజకీయ జీవితాన్ని, టీడీపీని సమాధి చేయనున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Revanth Reddy : బండి సంజయ్… కేసీఆర్ ఇద్దరి మాటలు ఒకేలా ఉన్నాయి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటు వేయటానికి మాత్రమే ఉన్నారా అంటూ చంద్రబాబును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఒక్క సెంటు భూమి అయినా పెదలకు ఇచ్చారా అని అడిగారు. అమరావతిలో రాజధాని కడితే పేదవాళ్ళు అక్కడ ఉండకూడదా..?అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా.. చంద్రబాబు రోడ్డు పై కేకలు, రంకెలు వేస్తున్నాడు..ఎంత మంది పొత్తులు పెట్టుకుని వచ్చినా వాళ్లను ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. మళ్లీ 2024లో వచ్చేది జగన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. చంద్రబాబు తన హయాంలో పేదలకు ఇచ్చానని చెప్పుకుంటున్న ఇళ్ళ స్థలాల వివరాలు బయట పెట్టాలి అంటూ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!