Gummanur Jayaram: మా నమ్మకం నీవే జగన్.. ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న 2024 ఎన్నిలకల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు.. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశాడు అని చెప్పలేడు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఏమి చేశాడో చెబుతాడు.. తప్ప ఆయన ఏమి చేసింది చెప్పులేని వ్యక్తి చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు.. ఇక, నారా లోకేష్ పాదయాత్రలో ఎటువంటి హామీలు ఇవ్వలేడని విమర్శించారు.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసం లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, మా నమ్మకం సీఎం జగనే.. మా నమ్మకం నీవే జగనన్న పేరుతో ఈ నెల 7వ తేదీన నుంచి 20వ తేదీ వరుకు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ గ్రామన జగనన్న పథకాలు తెలియజేస్తామన్న ఆయన.. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందన్నారు.. కానీ, రాష్ట్రాన్ని పాలించే అర్హత చంద్రబాబుకు లేదంటూ మండిపడ్డారు మంత్రి గుమ్మనూర్ జయరాం.
Read Also: Rashmika Mandanna : వామ్మో.. రష్మిక 27ఏళ్ల వయసులో అన్ని కోట్లా !
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
కాగా, జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేపట్టనున్న విషయం విదితమే.. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మందిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చే యనున్నారు.. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల ఇంఛార్జులు, జోనల్ కో-ఆర్డినేటర్లు ఇలా మొత్తం యంత్రాంగాన్ని కదిలించనున్నారు.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే భావన ప్రజల నుంచే వచ్చిందని పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.. ప్రజల జీవితాల్లో కీలక మార్పు తీసుకుని రావటమే ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. ప్రతి పేద కుటుంబం.. తన కాళ్ల మీద తాను నిలబడే విధంగా చేయడమే వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ టార్గెట్గా వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీ ఇంత విస్తృతంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి అని.. 7 లక్షల మంది జగన్ ప్రతినిధులుగా ప్రజల వద్దకు వెళ్తారని తెలిపారు.. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చిందో ప్రజలకు వివరిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం మంది ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిపొందారని పేర్కొన్నారు సజ్జల.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!