Gudivada Amarnath: వచ్చే విద్యా సంవత్సరం నుంచే పరిపాలన రాజధానిగా విశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే ఇవాళ సగం మంది టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని చురకలు అంటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఏపీ నిలిచిందని తెలిపారు.
రానున్న కాలంలో పరిశ్రమల్లో పెట్టబోయే పెట్టుబడులపై సభలో చర్చిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు గౌరవం, చిత్తశుద్ధి లేదని.. మిగిలిన టీడీపీ నేతల తీరు సభకు వచ్చామా… వెళ్లామా అనేలా ఉందని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ సెల్లింగ్లో చంద్రబాబు ఘనుడు అని.. పరిశ్రమలను ఎలా అమ్మేశాడో గతంలో చూశామని ఆరోపించారు. ఎంఎస్ఎమ్ఈల ద్వారా 2 లక్షల 11 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. మరో లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. బీచ్ ఐటీని అభివృద్ది చేస్తామని.. ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ మెంట్ మీట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మీట్లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గతంలో కంటే తమ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువగా జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో విశాఖ ప్రధాన నగరంగా ఉందని.. దేశంలోని టాప్ టెన్ నగరాల లిస్టులో విశాఖ ఉందని తెలిపారు.
Also Read
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
Read Also: Ram Charan: ఆస్కార్ రేసులో మెగా పవర్ స్టార్.. తారక్ కు పోటీ..?
విశాఖలో జరిగే లావాదేవీల్లో తప్పేముందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 17న మూడు రాజధానులపై సీఎం జగన్ తమ వైఖరి చెప్పారని.. మూడు రాజధానుల ప్రకటన తర్వాత లావాదేవీలను టీడీపీ నేతలు నిరూపించాలని.. ఆధారాలుంటే తీసుకురావాలని సూచించారు. విశాఖలో పెట్టబోయే రాజధాని కోసం ఒక్క సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోం అని.. అక్రమాలకు ఆస్కారం ఎక్కడ ఉందని నిలదీశారు. ఏమీ లేని అమరావతిలో రోడ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. యాత్ర పేరుతో విధ్వంసం సృష్టించాలని చూస్తే చంద్రబాబే బాధ్యుడు అవుతాడన్నారు.
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!