Gudivada Amarnath: వచ్చే విద్యా సంవత్సరం నుంచే పరిపాలన రాజధానిగా విశాఖ
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే ఇవాళ సగం మంది టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని చురకలు అంటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఏపీ నిలిచిందని తెలిపారు.
రానున్న కాలంలో పరిశ్రమల్లో పెట్టబోయే పెట్టుబడులపై సభలో చర్చిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాజ్యాంగంపై చంద్రబాబుకు గౌరవం, చిత్తశుద్ధి లేదని.. మిగిలిన టీడీపీ నేతల తీరు సభకు వచ్చామా… వెళ్లామా అనేలా ఉందని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ సెల్లింగ్లో చంద్రబాబు ఘనుడు అని.. పరిశ్రమలను ఎలా అమ్మేశాడో గతంలో చూశామని ఆరోపించారు. ఎంఎస్ఎమ్ఈల ద్వారా 2 లక్షల 11 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. మరో లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. బీచ్ ఐటీని అభివృద్ది చేస్తామని.. ఫిబ్రవరిలో ఇన్వెస్ట్ మెంట్ మీట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మీట్లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గతంలో కంటే తమ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువగా జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో విశాఖ ప్రధాన నగరంగా ఉందని.. దేశంలోని టాప్ టెన్ నగరాల లిస్టులో విశాఖ ఉందని తెలిపారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
Read Also: Ram Charan: ఆస్కార్ రేసులో మెగా పవర్ స్టార్.. తారక్ కు పోటీ..?
విశాఖలో జరిగే లావాదేవీల్లో తప్పేముందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. 2019 డిసెంబర్ 17న మూడు రాజధానులపై సీఎం జగన్ తమ వైఖరి చెప్పారని.. మూడు రాజధానుల ప్రకటన తర్వాత లావాదేవీలను టీడీపీ నేతలు నిరూపించాలని.. ఆధారాలుంటే తీసుకురావాలని సూచించారు. విశాఖలో పెట్టబోయే రాజధాని కోసం ఒక్క సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోం అని.. అక్రమాలకు ఆస్కారం ఎక్కడ ఉందని నిలదీశారు. ఏమీ లేని అమరావతిలో రోడ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. యాత్ర పేరుతో విధ్వంసం సృష్టించాలని చూస్తే చంద్రబాబే బాధ్యుడు అవుతాడన్నారు.
తాజావార్తలు
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
-
TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!