Minister Gudivada Amarnath: చంద్రబాబు ఇరుక్కోవడం ఖాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో ఫైబర్ నెట్ కార్యాలయాన్ని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ను మరింత ఆధునీకరించడం జరిగిందని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ ధరకు మూడు సర్వీసుల్ని అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
Read Also: Etela Rajender: ప్రాణహిత-చేవెళ్లకు అడ్డుపడింది కేసీఆరే..!
Also Read
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
ఇదే సమయంలో ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు గుప్పించారు. టెర్రా సాఫ్ట్వేర్ అవకతవకల కేసులో ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారని, ఈ కేసులో మొత్తం 18 మంది పాత్ర ఉన్నట్టు తేలిందని, చంద్రబాబు కూడా ఇందులో నిందితుడిగా తేలుతారని ఓ అడ్వకేట్గా తాను చెబుతున్నానన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ (APSFL)కి చంద్రబాబు రూ. 650 కోట్ల అప్పు మిగిల్చి వెళ్ళారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బు కోసం పని చేస్తే, జగన్ జనం కోసం పని చేస్తున్నారని చెప్పారు.
ఏపీ ఫైబర్ నెట్ వర్క్ను ఎనర్జీ విభాగం నుంచి పరిశ్రమల విభాగానికి మార్చడం జరిగిందని చెప్పిన ఆయన.. ఇప్పటివరకు 10 లక్షల కనెక్షన్లు ఏపీలో ఫైబర్ నెట్వర్క్ ద్వారా అందిస్తున్నామన్నారు. మరోవైపు.. రాబోయే ఐదు నెలల్లో లక్ష కిలో మీటర్లు ఫైబర్ వేయబోతున్నామని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్కు ఒకటే చెప్పాం.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Adivi Sesh: బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అడివి శేష్.. అక్టోబర్లో కొత్త యాక్షన్ మూవీ షూటింగ్!
-
POK Protests: పీవోకేలో నిరసనల వేళ కాశ్మీర్ కార్డు.. పాక్ ఆర్మీ చీఫ్ తాజా వ్యాఖ్యలు
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
ట్రెండింగ్
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!