Dharmana Prasada Rao: మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి..! ఓ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతూనే ఉంది.. మూడు రాజధానుల ఏర్పాటు వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండగా.. విపక్షాలు మాత్రం.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై మండిపడ్డారు.. జన్మభూమి కార్యకర్తలు పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.. జన్మ భూమి కార్యకర్తలు స్వతంత్ర సమరయోధుల్లా వీధుల్లో పడి తిరిగేవాళ్లని విమర్శించారు. కానీ, వైఎస్ జగన్ సర్కార్లో సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా.. నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని.. ఈ ప్రభుత్వంలో సంక్షేమం చూడలేక బాదుడే బాదుడు అని చంద్రబాబు తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చే శారు.
Read Also: Lucky Lakshman Movie Review: లక్కీ లక్ష్మణ్ రివ్యూ
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
ఇక, ఉత్తరాంధ్రలో తిరుగుతూ అమరావతి రాజధాని అని చంద్రబాబు చెబుతున్నారంటే మన చేతులతో మన కళ్లని పొడిచే ప్రయత్నమే అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన.. చంద్రబాబు అమరావతి రాజధాని అని చెబుతున్నాడు.. అదే జరిగితే, మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి.. మేం ఒక చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాల్లో ఇంకా ఎక్కడో సైకిల్ భావన ఉంది, ఇంకా సైకిల్ ని నమ్మి మోసపోకండి అంటూ పిలుపునిచ్చారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని ఆరోపించారు.. ముసలివాడు అయినా మొన్న కారుమీద ఎక్కి డ్యాన్స్లు చేశాడు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అయితే, మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి..
తాజావార్తలు
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!