Dharmana Prasad Rao: రాజధానిగా ఉండే అర్హత విశాఖకు మాత్రమే ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasad Rao: విశాఖ రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంస్కరణలు చేసే వాళ్లపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని అందుకే ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధర్మాన తెలిపారు. సంస్కరణలకు ముందే ఫలితాలు రావని.. అందుకే ప్రజల ఆమోదం ఉండదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటే దానికి కారణం సంస్కరణలను అర్ధం చేసుకోలేకపోవడమే అని ధర్మాన అభిప్రాయపడ్డారు.
సంస్కరణలను చేయని వారిని నిందించాల్సింది పోయి సంస్కరణలు చేసే వారిపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి ధర్మాన అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనేక పెద్ద ప్రాజెక్టులను తెచ్చామని.. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, మూల పేటలో పోర్టుకు డిసెంబరులో శంకుస్థాపన చేస్తామన్నారు. 75 ఏళ్ల రాష్ట్ర సంపద, సంస్థలను హైదరాబాద్లో పెట్టామని.. అందుకే వారికి ఆశ కలిగిందన్నారు. అమరావతికి డబ్బులు పెట్టాక వారు పోమ్మంటే ఉత్తరాంధ్ర ఏం చేయాలని ధర్మాన ప్రశ్నించారు. విశాఖ ఉద్యమం కోసం రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఇదే విషయం పార్టీకి చెప్పానని తెలిపారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
Read Also: Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే ఏమిటి? గ్రహణం సమయంలో ఆహార పదార్ధాలపై దర్భను ఎందుకు పెట్టాలి?
రాష్ట్రానికి విశాఖ సెంట్రల్ పాయింట్లో లేదని జడ్జిలు మాట్లాడుతున్నారని.. చెన్నై, ముంబై, కోల్కతా వంటి రాజధానులు ఆయా రాష్ట్రాల సెంట్రల్లో ఉన్నాయా అని మంత్రి ధర్మాన నిలదీశారు. క్యాపిటల్ వస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుందని.. పలువురికి ఉపాధి లభిస్తుందని ధర్మాన అన్నారు. కేవలం విశాఖకు మాత్రమే రాజధానిగా అన్ని విధాలుగా అర్హత ఉందన్నారు. అందరినీ ఆదరించే గుణం, సంస్కారం విశాఖ వాసులకు ఉందన్నారు. మూడు రాజధానులు అంటూ పలువురు హేళన చేస్తున్నారని.. విశాఖ మెయిన్ రాజధానిగా ఉంటుందని.. హైకోర్టు పనులు కోసం కర్నూలుకు, అసెంబ్లీ సమావేశాల సమయంలో అమరావతికి ప్రజలు వెళ్తారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!