Minister Dadisetti Raja: సర్వేల్లో ప్రజల పల్స్ చూసి చంద్రబాబు, పవన్ వణికిపోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dadisetti Raja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్వాతంత్ర్య స్ఫూర్తితో జనసేన స్థాపించలేదని ఆరోపించారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా కొమ్ముకాయడానికే పార్టీ స్థాపించాడని.. ప్రస్తుతం ఆ విధంగానే పవన్ అడుగులు వేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ విచిత్రమైన రాజకీయ రాజకీయాలు చేస్తున్నారని.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పవన్ విన్యాసాలు ఉన్నాయని చురకలు అంటించారు. పవన్ అసలు నీకు స్వాతంత్య్రం ఉందా అని ప్రశ్నించారు. పవన్కు దమ్ముంటే 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లలో పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. పవన్ రాజకీయం ప్రజలకు రుచించడం లేదని ఎద్దేవా చేశారు.
Read Also: Bandla Ganesh: రంభల రాంబాబు గారికి త్వరలో మా సార్ సమాధానం చెప్తారు
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
ఈరోజు ఏ సర్వే చూసినా వైసీపీదే విజయం అని చెబుతున్నాయని.. సర్వేల్లో ప్రజల పల్స్ చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వణికిపోతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.. ఆయనేమో టీడీపీ వైపు చూస్తాడని కౌంటర్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న ఏపీలో అలజడులు సృష్టించేందుకే పవన్, చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా కాలేని పవన్ సీఎం జగన్పై ఛాలెంజ్లు చేయడం సిగ్గుచేటన్నారు. కాపులెవరూ పవన్ను నమ్మే పరిస్ధితిలో లేరన్నారు. పవన్కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టే అని కాపులకు తెలుసన్నారు. తుని ఘటనలో కాపులను అనేక చిత్ర హింసలకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. అలాంటి వ్యక్తికి మళ్ళీ కాపులను తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నాడని.. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో పవన్ ఉన్నాడని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!