Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Buggana Rajendranath Reddy Gives Clarity On Jagan London Tour

Minister Buggana: సీఎం జగన్ అందుకే లండన్ వెళ్లారు..!!

Published Date :May 21, 2022 , 3:18 pm
By Ramesh Nalam
Minister Buggana: సీఎం జగన్ అందుకే లండన్ వెళ్లారు..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జగన్ దావోస్ వెళ్లారని ప్రభుత్వం నిన్న ప్రకటించింది. అయితే సీఎం జగన్ దావోస్ వెళ్లలేదని నేరుగా లండన్ వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపీకి, ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందని.. కనీస విలువలను పాటించాలన్న స్పృహ కోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి నుంచి ముఖ్యమంత్రి కుటుంబానికే కాదు, రాష్ట్రానికి కూడా ముప్పు మరింత పెరిగిందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ దావోస్‌ పర్యటనపై యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. వయసు మీద పడుతున్న కొద్దీ యనమల కనీస సంస్కారం లేకుండా దిగజారి పోతున్నారని.. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారికి కూడా విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనల మీద అవగాహన లేకపోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు. దాపరికం, దొంగ దారుల్లో అధికారం సాధించడం, ప్రజల్ని వంచించడం టీడీపీ ట్రేడ్‌ మార్క్‌ అని బుగ్గన విమర్శలు చేశారు. సీఎం పర్యటన రహస్యమేమీ కాదని.. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదని క్లారిటీ ఇచ్చారు.

శుక్రవారం నాడు గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందని.. ఎయిర్‌ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగిందని బుగ్గన తెలిపారు. దీని వల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు ఆలస్యం అయ్యిందని.. లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉండటంతో జురెక్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందని.. మళ్లీ ల్యాండింగ్‌ కోసం అధికారులు రిక్వెస్ట్‌ పెట్టారని వివరించారు. ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా పాల్గొన్నట్లు బుగ్గన తెలిపారు. అయితే రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాల ల్యాండింగ్‌ను చాలా కాలం నుంచి నిషేధించారని.. ఈ విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారని పేర్కొన్నారు.

Yanamala Ramakrishnudu: జగన్ లండన్ ల్యాండింగ్ మిస్టరీ ఏంటి?

ఈ విషయాలన్నీ స్విట్జర్లాండ్‌ లోని భారత ఎంబసీ అధికారులు లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారు. వారు అధికారులతో చర్చించి.. లండన్‌లోనే సీఎం జగన్‌కు బస ఏర్పాటు చేశారని బుగ్గన తెలిపారు. శనివారం తెల్లవారుజామునే జురెక్‌ బయలుదేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధమైందని.. పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని బుగ్గన వివరించారు. నిజాలు ఇలా ఉంటే సీఎం మీద అసూయతో, ద్వేషంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారని.. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుందని బుగ్గన ఎద్దేవా చేశారు. శనివారం సాయంత్రం కల్లా సీఎం జగన్ దావోస్‌ చేరుకుంటారని బుగ్గన స్పష్టం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm jagan
  • Davos Tour
  • London
  • Telugu Desam Party

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions