Botsa Satyanarayana: విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు నిధుల విభజన కూడా జరగాలన్నారు. ఉద్యమాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్తామన్నారు. జాతి సంపద అందరికీ చెందాల్సిందేనని స్పష్టం చేశారు.
రాజకీయ కారణాలతో విశాఖను రాజధానిగా వ్యతిరేకించడం అంటే ద్రోహం చేయడమేనని మంత్రి బొత్స ఆరోపించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విశాఖను రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధానిగా ఎందుకు వద్దో వ్యతిరేకించేవారందరూ చెప్పాలన్నారు. అమరావతికి రాజధాని వచ్చినప్పుడు తాము వ్యతిరేకించలేదని.. మరి విశాఖకు అవకాశం వస్తే ఎందుకు వద్దంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
Read Also: YV Subbareddy: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలి
మరోవైపు వికేంద్రీకరణ అంశంపై కాకినాడ వేదికగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కన్నబాబు కూడా స్పందించారు. వికేంద్రీకరణ అనేది తమ ప్రభుత్వ నినాదం అని.. టీడీపీ వాళ్లు కోరుకున్న అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటం లేదని వాళ్ల బాధగా కనిపిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును లేపడానికి జాకీలు వేసి జగన్పై బురద చల్లుతున్నారు. ఒకవైపు చంద్రబాబుకు భజన చేసి.. మరోవైపు జగన్పై విషం చిమ్ముతున్నారు.రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుబాటుతనం పవన్ కళ్యాణ్కు కనిపించదా అని కన్నబాబు ప్రశ్నించారు. రాజధానుల వికేంద్రీకరణలో అమరావతి కూడా ఉండాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!