SSC Question Paper Leak: టెన్త్ పేపర్ లీక్ కాలేదు… అది కుట్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ప్రశ్నం లీక్ వార్తలు కలకలం సృష్టించాయి.. అయితే, ఎక్కడా టెన్త్ పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఉదయం 9:30 గంటల కంటే ముందుగా పేపర్ బయటకొస్తే లీక్గా భావిస్తారని, నంద్యాలలో పేపర్ లీక్ అంటూ కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. కుట్రకు పాల్పడిన వారిపైనా, టీచర్లపైనా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయిందంటూ నిన్నో సంఘటన జరిగితే.. ఇవాళో ప్రచారం జరిగింది. ఇక, ఇవాళ కూడా అదే తరహాలో లీక్ జరిగిందంటూ ప్రచారం పెట్టారన్నారు.. ఇవాళ, నిన్న పేపర్ లీక్ కాలేదు, కాపీయింగ్ కూడా జరగలేదని స్పష్టం చేశారు.
Read Also: Breaking: టాలీవుడ్లో విషాదం.. డైరెక్టర్ పైడి రమేష్ మృతి
Also Read
అయితే, ఇలాంటి ప్రచారంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించేందుకు కుట్రలు పన్నినట్టు గుర్తించామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ… నారాయణ, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో పని చేస్తోన్న వారే దీనికి కారకులనే నిర్ధారణకు వస్తున్నాం.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహిస్తోంటే.. ఈ తరహా ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. 24 పేజీల బుక్ లెట్లల్లో పరీక్షలు రాస్తుంటే.. అన్సర్ షీట్లు బయటకు వచ్చేస్తున్నాయని ప్రచారం కరెక్టేనా..? ఆరు లక్షలకు పైగా విద్యార్ధినీ విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. వారిని మానసిక క్షోభకు గురి చేసేలా వ్యవహరించడం సరైన పనేనా..? అంటూ మండిపడ్డారు. విద్యార్ధినీ, విద్యార్థులెవ్వరూ లీకేజీ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. చక్కగా వెళ్లి పరీక్షలు రాయండి.. తప్పు జరిగితే ఒప్పుకుంటాం.. సరిదిద్దుకుంటాం అన్నారు.
పరీక్షలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం.. నిన్న, ఇవాళ ఎక్కడ లీకులు కానీ.. మాల్ ప్రాక్టీస్ కానీ జరగలేదు.. ఈ కుట్రకు కారణాలేంటనేది ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు చంద్రబాబు ఈ తరహాలో కుట్రలు పన్నుతున్నారని రాజకీయ కోణంలో నేను భావిస్తున్నానని తెఇపారు.. ఇక, వార్డ్ బాయ్గా తొమ్మిదో తరగతి అబ్బాయిని పెట్టడం తప్పే నని.. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి బొత్స.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..