SSC Question Paper Leak: టెన్త్ పేపర్ లీక్ కాలేదు… అది కుట్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ప్రశ్నం లీక్ వార్తలు కలకలం సృష్టించాయి.. అయితే, ఎక్కడా టెన్త్ పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఉదయం 9:30 గంటల కంటే ముందుగా పేపర్ బయటకొస్తే లీక్గా భావిస్తారని, నంద్యాలలో పేపర్ లీక్ అంటూ కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. కుట్రకు పాల్పడిన వారిపైనా, టీచర్లపైనా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయిందంటూ నిన్నో సంఘటన జరిగితే.. ఇవాళో ప్రచారం జరిగింది. ఇక, ఇవాళ కూడా అదే తరహాలో లీక్ జరిగిందంటూ ప్రచారం పెట్టారన్నారు.. ఇవాళ, నిన్న పేపర్ లీక్ కాలేదు, కాపీయింగ్ కూడా జరగలేదని స్పష్టం చేశారు.
Read Also: Breaking: టాలీవుడ్లో విషాదం.. డైరెక్టర్ పైడి రమేష్ మృతి
Also Read
- Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
- PM Modi AP Visit: భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆంక్షలు.. 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్లైన్ పెట్టి మరి..!
అయితే, ఇలాంటి ప్రచారంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించేందుకు కుట్రలు పన్నినట్టు గుర్తించామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ… నారాయణ, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో పని చేస్తోన్న వారే దీనికి కారకులనే నిర్ధారణకు వస్తున్నాం.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహిస్తోంటే.. ఈ తరహా ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. 24 పేజీల బుక్ లెట్లల్లో పరీక్షలు రాస్తుంటే.. అన్సర్ షీట్లు బయటకు వచ్చేస్తున్నాయని ప్రచారం కరెక్టేనా..? ఆరు లక్షలకు పైగా విద్యార్ధినీ విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. వారిని మానసిక క్షోభకు గురి చేసేలా వ్యవహరించడం సరైన పనేనా..? అంటూ మండిపడ్డారు. విద్యార్ధినీ, విద్యార్థులెవ్వరూ లీకేజీ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. చక్కగా వెళ్లి పరీక్షలు రాయండి.. తప్పు జరిగితే ఒప్పుకుంటాం.. సరిదిద్దుకుంటాం అన్నారు.
పరీక్షలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం.. నిన్న, ఇవాళ ఎక్కడ లీకులు కానీ.. మాల్ ప్రాక్టీస్ కానీ జరగలేదు.. ఈ కుట్రకు కారణాలేంటనేది ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు చంద్రబాబు ఈ తరహాలో కుట్రలు పన్నుతున్నారని రాజకీయ కోణంలో నేను భావిస్తున్నానని తెఇపారు.. ఇక, వార్డ్ బాయ్గా తొమ్మిదో తరగతి అబ్బాయిని పెట్టడం తప్పే నని.. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి బొత్స.
తాజావార్తలు
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
-
Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
-
Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
-
Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
-
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!