SSC Question Paper Leak: టెన్త్ పేపర్ లీక్ కాలేదు… అది కుట్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ప్రశ్నం లీక్ వార్తలు కలకలం సృష్టించాయి.. అయితే, ఎక్కడా టెన్త్ పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఉదయం 9:30 గంటల కంటే ముందుగా పేపర్ బయటకొస్తే లీక్గా భావిస్తారని, నంద్యాలలో పేపర్ లీక్ అంటూ కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. కుట్రకు పాల్పడిన వారిపైనా, టీచర్లపైనా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ అయిందంటూ నిన్నో సంఘటన జరిగితే.. ఇవాళో ప్రచారం జరిగింది. ఇక, ఇవాళ కూడా అదే తరహాలో లీక్ జరిగిందంటూ ప్రచారం పెట్టారన్నారు.. ఇవాళ, నిన్న పేపర్ లీక్ కాలేదు, కాపీయింగ్ కూడా జరగలేదని స్పష్టం చేశారు.
Read Also: Breaking: టాలీవుడ్లో విషాదం.. డైరెక్టర్ పైడి రమేష్ మృతి
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
అయితే, ఇలాంటి ప్రచారంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించేందుకు కుట్రలు పన్నినట్టు గుర్తించామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ… నారాయణ, ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో పని చేస్తోన్న వారే దీనికి కారకులనే నిర్ధారణకు వస్తున్నాం.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను నిర్వహిస్తోంటే.. ఈ తరహా ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. 24 పేజీల బుక్ లెట్లల్లో పరీక్షలు రాస్తుంటే.. అన్సర్ షీట్లు బయటకు వచ్చేస్తున్నాయని ప్రచారం కరెక్టేనా..? ఆరు లక్షలకు పైగా విద్యార్ధినీ విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. వారిని మానసిక క్షోభకు గురి చేసేలా వ్యవహరించడం సరైన పనేనా..? అంటూ మండిపడ్డారు. విద్యార్ధినీ, విద్యార్థులెవ్వరూ లీకేజీ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. చక్కగా వెళ్లి పరీక్షలు రాయండి.. తప్పు జరిగితే ఒప్పుకుంటాం.. సరిదిద్దుకుంటాం అన్నారు.
పరీక్షలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం.. నిన్న, ఇవాళ ఎక్కడ లీకులు కానీ.. మాల్ ప్రాక్టీస్ కానీ జరగలేదు.. ఈ కుట్రకు కారణాలేంటనేది ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు చంద్రబాబు ఈ తరహాలో కుట్రలు పన్నుతున్నారని రాజకీయ కోణంలో నేను భావిస్తున్నానని తెఇపారు.. ఇక, వార్డ్ బాయ్గా తొమ్మిదో తరగతి అబ్బాయిని పెట్టడం తప్పే నని.. సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి బొత్స.
తాజావార్తలు
-
Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి… ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ….
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
-
Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు… ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
-
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!