Audimulapu Suresh: సీఎం జగన్ సంకల్పం ముందు.. దుష్టశక్తుల పన్నాగాలు నిలవలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Audimulapu Suresh Says Amaravati Houses Will Finish In 6 Months: ముఖ్యమంత్రి జగన్ సంకల్పం ముందు దుష్టశక్తుల పన్నాగాలు నిలవలేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో పేదలకు సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్లు ఇస్తుంటే, రైతుల ముసుగులో వాటిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించారని.. ఇది నిజంగా దుర్మార్గమని ధ్వజమెత్తారు. రెండు నుంచి మూడు లక్షల కోట్ల ఆస్తిని పేద మహిళల చేతిలో ముఖ్యమంత్రి పెట్టడం ఒక చరిత్ర అని వెల్లడించారు.
Yarlagadda Venkata Rao: కన్ఫ్యూజన్లో యార్లగడ్డ.. ఏ పార్టీ అనేది నో క్లారిటీ
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
కోర్టు కూడా పేదల పక్షాన నిలబడి.. ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి ఆమోదం తెలిపిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సెంటు భూమిలో ఇల్లు కట్టి ఇస్తామంటే.. చంద్రబాబు అవహేళన చేశారని విమర్శించారు. సెంటు భూమిలో సమాధులు కట్టుకోమని పేదలను అవమానించారని విరుచుకుపడ్డారు. పెత్తందార్లు ఉన్న చోట పేదలు ఉండకూడదని చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. ఆరు నెలల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. షియర్వాల్ టెక్నాలజీ ద్వారా ఇళ్ళ నిర్మాణాలు వేగంగా పూర్తవుతాయని తెలిపారు. కేవలం నమ్మకంతోనే ప్రజల మనసును గెలవలేరని హితవు పలికారు. అన్ని వసతులతో జగనన్న ఊర్లు త్వరలోనే రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
Malleshwari Case: పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని.. భర్త ఏం చేశాడంటే?
అంతకుముందు కూడా.. రాజధానిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు పూర్తి చేసి తీరుతామని మంత్రి సురేష్ ఉద్ఘాటించారు. దీనిపై రైతులు సుప్రీంకోర్టుకు వెళ్తే.. తాము కూడా వెళ్తామని ఛాలెంజ్. హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా.. నిర్మాణాలకు అడ్డంకి ఉండదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 5, 6 నెలల్లో 50వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కాగా.. సోమవారం వైఎస్ జగన్ సీఆర్డీఏ పరిధిలోని కృష్ణయపాలెం లేఅవుట్లో పైలాన్ని ఆవిష్కరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, మోడల్ హౌస్ను పరిశీలించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!