Audimulapu Suresh: సీఎం జగన్ సంకల్పం ముందు.. దుష్టశక్తుల పన్నాగాలు నిలవలేదు
Minister Audimulapu Suresh Says Amaravati Houses Will Finish In 6 Months: ముఖ్యమంత్రి జగన్ సంకల్పం ముందు దుష్టశక్తుల పన్నాగాలు నిలవలేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో పేదలకు సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఇళ్లు ఇస్తుంటే, రైతుల ముసుగులో వాటిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించారని.. ఇది నిజంగా దుర్మార్గమని ధ్వజమెత్తారు. రెండు నుంచి మూడు లక్షల కోట్ల ఆస్తిని పేద మహిళల చేతిలో ముఖ్యమంత్రి పెట్టడం ఒక చరిత్ర అని వెల్లడించారు.
Yarlagadda Venkata Rao: కన్ఫ్యూజన్లో యార్లగడ్డ.. ఏ పార్టీ అనేది నో క్లారిటీ
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
కోర్టు కూడా పేదల పక్షాన నిలబడి.. ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి ఆమోదం తెలిపిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సెంటు భూమిలో ఇల్లు కట్టి ఇస్తామంటే.. చంద్రబాబు అవహేళన చేశారని విమర్శించారు. సెంటు భూమిలో సమాధులు కట్టుకోమని పేదలను అవమానించారని విరుచుకుపడ్డారు. పెత్తందార్లు ఉన్న చోట పేదలు ఉండకూడదని చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. ఆరు నెలల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. షియర్వాల్ టెక్నాలజీ ద్వారా ఇళ్ళ నిర్మాణాలు వేగంగా పూర్తవుతాయని తెలిపారు. కేవలం నమ్మకంతోనే ప్రజల మనసును గెలవలేరని హితవు పలికారు. అన్ని వసతులతో జగనన్న ఊర్లు త్వరలోనే రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
Malleshwari Case: పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని.. భర్త ఏం చేశాడంటే?
అంతకుముందు కూడా.. రాజధానిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు పూర్తి చేసి తీరుతామని మంత్రి సురేష్ ఉద్ఘాటించారు. దీనిపై రైతులు సుప్రీంకోర్టుకు వెళ్తే.. తాము కూడా వెళ్తామని ఛాలెంజ్. హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా.. నిర్మాణాలకు అడ్డంకి ఉండదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 5, 6 నెలల్లో 50వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కాగా.. సోమవారం వైఎస్ జగన్ సీఆర్డీఏ పరిధిలోని కృష్ణయపాలెం లేఅవుట్లో పైలాన్ని ఆవిష్కరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, మోడల్ హౌస్ను పరిశీలించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో