AppalaRaju: పవన్ కళ్యాణ్ పగటి వేషగాడు.. చంద్రబాబుకు పూర్తిగా అమ్ముడుపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AppalaRaju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ పగటి వేషగాడిలా ఉన్నాడని ఆరోపించారు. గ్రామాల్లో పండగల సమయంలో పగటి వేషగాళ్లు వస్తారని.. ఇప్పుడు పవన్ కూడా అలాగే వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనంపై 2019 తర్వాత అని పవన్ మాట్లాడుతున్నాడని.. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పవన్ యజమాని చంద్రబాబు అని.. 2014 నుంచి 19 వరకు మాట్లాడొద్దు అని చెప్పాడా అని ప్రశ్నించారు. మాట్లాడితే చంద్రబాబు ప్యాకేజీ తగ్గిస్తా అన్నాడా పవన్ అని సూటి ప్రశ్న వేశారు.
మత్స్యకారుల వలసలపై పవన్ కళ్యాణ్కు అసలు అవగాహన ఉందా అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చాక ఎవరైనా హార్బర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టారా అని అడిగారు. కానీ సీఎం జగన్ మాత్రమే ఈ అంశంపై దృష్టి పెట్టారని.. ఇప్పటికే కొన్ని హార్బర్లకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. మారికొన్ని హార్బర్లకు శంకుస్థాపన త్వరలో జరుగుతుందని మంత్రి అప్పలరాజు వివరించారు. మత్స్యకారుల జీవితాల్లో జగన్ దేవుడిగా మిగులుతాడని కొనియాడారు. 9 హార్బర్లు అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్దే అన్నారు.
Also Read
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
Read Also: Tollywood: జనవరి 14న హిస్టరీ రిపీట్ అవుతుందా?
పవన్ కళ్యాణ్ది అసలు నిజమైన రాజకీయమేనా అని అప్పలరాజు నిలదీశారు. చంద్రబాబు పంపిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ సభకు యువశక్తి అని పేరుపెట్టారని.. అటు లోకేష్ పాదయాత్ర పేరు యువగళం అని.. పవన్ సభకు కూడా చంద్రబాబే పేరు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు గ్యారంటీ ఇవ్వరని కార్యకర్తలను పవన్ అంటున్నాడని.. అతడికి వీరమరణం అవసరమా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రెండు జెండాలు పట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన కార్యకర్తలకు పవన్ చెప్పాలన్నారు. అభిమానుల ఆశయాన్ని పవన్ తాకట్టు పెట్టేశాడని.. చంద్రబాబుకు అమ్మేశాడని అప్పలరాజు విమర్శలు చేశారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని హితవు పలికారు. జగన్ సింహం లాంటోడని.. ఎంతమంది కలిసినా ఏం చేయలేరని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!