AppalaRaju: పవన్ కళ్యాణ్ పగటి వేషగాడు.. చంద్రబాబుకు పూర్తిగా అమ్ముడుపోయాడు
AppalaRaju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ పగటి వేషగాడిలా ఉన్నాడని ఆరోపించారు. గ్రామాల్లో పండగల సమయంలో పగటి వేషగాళ్లు వస్తారని.. ఇప్పుడు పవన్ కూడా అలాగే వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనంపై 2019 తర్వాత అని పవన్ మాట్లాడుతున్నాడని.. 2014 నుంచి 2019 వరకు పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పవన్ యజమాని చంద్రబాబు అని.. 2014 నుంచి 19 వరకు మాట్లాడొద్దు అని చెప్పాడా అని ప్రశ్నించారు. మాట్లాడితే చంద్రబాబు ప్యాకేజీ తగ్గిస్తా అన్నాడా పవన్ అని సూటి ప్రశ్న వేశారు.
మత్స్యకారుల వలసలపై పవన్ కళ్యాణ్కు అసలు అవగాహన ఉందా అని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చాక ఎవరైనా హార్బర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టారా అని అడిగారు. కానీ సీఎం జగన్ మాత్రమే ఈ అంశంపై దృష్టి పెట్టారని.. ఇప్పటికే కొన్ని హార్బర్లకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. మారికొన్ని హార్బర్లకు శంకుస్థాపన త్వరలో జరుగుతుందని మంత్రి అప్పలరాజు వివరించారు. మత్స్యకారుల జీవితాల్లో జగన్ దేవుడిగా మిగులుతాడని కొనియాడారు. 9 హార్బర్లు అందుబాటులోకి తెచ్చిన ఘనత జగన్దే అన్నారు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
Read Also: Tollywood: జనవరి 14న హిస్టరీ రిపీట్ అవుతుందా?
పవన్ కళ్యాణ్ది అసలు నిజమైన రాజకీయమేనా అని అప్పలరాజు నిలదీశారు. చంద్రబాబు పంపిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ సభకు యువశక్తి అని పేరుపెట్టారని.. అటు లోకేష్ పాదయాత్ర పేరు యువగళం అని.. పవన్ సభకు కూడా చంద్రబాబే పేరు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు గ్యారంటీ ఇవ్వరని కార్యకర్తలను పవన్ అంటున్నాడని.. అతడికి వీరమరణం అవసరమా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రెండు జెండాలు పట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన కార్యకర్తలకు పవన్ చెప్పాలన్నారు. అభిమానుల ఆశయాన్ని పవన్ తాకట్టు పెట్టేశాడని.. చంద్రబాబుకు అమ్మేశాడని అప్పలరాజు విమర్శలు చేశారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని హితవు పలికారు. జగన్ సింహం లాంటోడని.. ఎంతమంది కలిసినా ఏం చేయలేరని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో