Minister Appala Raju: అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుల రాజధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Appala Raju: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు అమరావతి నుంచి అరసవల్లి యాత్ర అంటూ చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘూతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపై దండయాత్ర కోసమేనా అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వాళ్ల అమరావతి యాత్రనా లేదా విశాఖపై దౌర్జన్య యాత్రనా అని నిలదీశారు. చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారని.. తమ మనసులను గాయపర్చమని రైతులను ఉసిగొల్పుతున్నారని విమర్శలు చేశారు.
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
పాదయాత్ర పేరిట ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే ఖబడ్దార్ అంటూ మంత్రి అప్పలరాజు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలను విశాఖ ఎయిర్పోర్టులో చంద్రబాబు ఒకసారి రుచిచూశారని.. ఉత్తరాంధ్ర ఎప్పటికీ వెనుకబడే ఉండాలన్నది ఆయన ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను జగన్ అభివృద్ధి చేస్తానంటే ఆయనకేం బాధ అంటూ చురకలు అంటించారు. పేదలకు ఇళ్లు పంపిణీ చేయవద్దని కోర్టుకు వెళ్లారని.. కేవలం చంద్రబాబు సామాజిక వర్గం వారే ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని.. కేవలం కుల రాజధాని అంటూ ఆరోపించారు. తన కులం కోసం మాత్రమే చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటించారన్నారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు గాజులు వేసుకుని కూర్చోవాలా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ అని.. చంద్రబాబు తమాషాలు చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడం తప్పు అని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!