Minister Appala Raju: అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుల రాజధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Appala Raju: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు అమరావతి నుంచి అరసవల్లి యాత్ర అంటూ చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘూతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపై దండయాత్ర కోసమేనా అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వాళ్ల అమరావతి యాత్రనా లేదా విశాఖపై దౌర్జన్య యాత్రనా అని నిలదీశారు. చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారని.. తమ మనసులను గాయపర్చమని రైతులను ఉసిగొల్పుతున్నారని విమర్శలు చేశారు.
Also Read
పాదయాత్ర పేరిట ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే ఖబడ్దార్ అంటూ మంత్రి అప్పలరాజు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలను విశాఖ ఎయిర్పోర్టులో చంద్రబాబు ఒకసారి రుచిచూశారని.. ఉత్తరాంధ్ర ఎప్పటికీ వెనుకబడే ఉండాలన్నది ఆయన ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను జగన్ అభివృద్ధి చేస్తానంటే ఆయనకేం బాధ అంటూ చురకలు అంటించారు. పేదలకు ఇళ్లు పంపిణీ చేయవద్దని కోర్టుకు వెళ్లారని.. కేవలం చంద్రబాబు సామాజిక వర్గం వారే ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని.. కేవలం కుల రాజధాని అంటూ ఆరోపించారు. తన కులం కోసం మాత్రమే చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటించారన్నారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు గాజులు వేసుకుని కూర్చోవాలా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ అని.. చంద్రబాబు తమాషాలు చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడం తప్పు అని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!