AP Heavy Rains: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్షాలు..
- పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ..
- విద్యా సంస్థలకు రెండ్రోజులు సెలవులు ఇచ్చిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు (బుధవారం) ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం రేపు (గురువారం) తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనింది. దక్షిణకోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పుకొచ్చింది.
Read Also: Citadel Honey Bunny: 11 నిమిషాల సీన్ సింగిల్ టేక్లో చేశాం: వరుణ్
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
కాగా, ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అయితే, ప్రకాశం జిల్లాలోని ఏడు మండలాల్లో ఇవాళ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అర్ధవీడు, దోర్నాల, కంభం, పెద్దరావీడు, మార్కాపురం, రాచర్ల, ముండ్లమూరు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక, ఒక్క రోజులోనే 20 సెంటీ మీటర్ల వర్షం కురవవచ్చని అంచనా వేసింది. ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం.. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు 125 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
Read Also: Ponguleti Srinivasa Reddy: అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి.. ప్రజా పాలనలో ఉన్నాం
అయితే, రేపు (గురువారం) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి -60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!