Merugu Nagarjuna: మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత జగన్ది.. చంద్రబాబులా మాయం చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna Comments On Chandrababu Naidu: మేనిఫెస్టోని తూ.చ. తప్పకుండా అమలు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్ది అని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. జగన్ హయాంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నామని తెలిపారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయినా.. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగన్దేనని చెప్పారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోని అమలు చేయలేక.. దాన్ని కనపడకుండా చేయలేదని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకున్నారని ఆరోపణలు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే, అన్యాయంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ మోసం చేసిన మనిషి చంద్రబాబు అని దుయ్యబట్టారు.
Also Read
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
అంతకుముందు కూడా.. చంద్రబాబు పార్టీ ఇప్పుడు శవ పేటికలా మారిందంటూ మంత్రి నాగార్జున ధ్వజమెత్తారు. పేదలకు జగన్ సెంటు ఇళ్లు, ఇంగ్లీషు విద్య ఇస్తుంటే.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే.. ఒక్క సంక్షేమ పథకం కూడా పెట్టలేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. బీసీల తోక కత్తిరిస్తాను అన్నాడని, ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని చెప్పాడని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు చేసిన చంద్రబాబు.. అందులో ఎన్ని అమలు చేశావో చెప్పాలంటూ నిలదీశారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను స్మశానంతో పోల్చిన నీచుడు చంద్రబాబు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ తొలగించేస్తారని అన్నారు.
26/11 Attack: పాక్ జైల్లో 26/11 దాడి నిందితుడైన హఫీజ్ సయీద్ సన్నిహితుడి మృతి
పేదలకు సెంటు స్థలం ఇస్తుంటే సహించలేని చంద్రబాబు.. పేదలను ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని మంత్రి నాగార్జున విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని విమర్శించారు. వైసీపీ అమలు చేస్తున్న ‘అమ్మకు ఒడి’ పథకాన్ని ‘అమ్మకు వందనం’ పేరుతో కాపీ కొట్టారని తూర్పారపట్టారు. తన 75 ఏళ్ల జీవితంలో చంద్రబాబుకు పూర్ టు రిచ్ అనే కార్యక్రమం ఇప్పుడే గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. సరికొత్త వాగ్దానాలు చేయడం, నాటకాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడూ తాను ప్రకటించిన మేనిఫెస్టోని అమలు చేయలేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!