26/11 Attack: పాక్ జైల్లో 26/11 దాడి నిందితుడైన హఫీజ్ సయీద్ సన్నిహితుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Attack: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఉగ్రవాది హఫీజ్ సయీద్కు సన్నిహితుడు అబ్దుల్ సలామ్ భుట్టావీ పాకిస్థాన్ జైలులో మరణించాడు. అబ్దుల్ సలామ్ భుట్టావీ 2008 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను సిద్ధం చేయడంలో సహాయం చేశాడు. టెర్రిరిస్టుల ఫండింగ్ కోసం ప్రయత్నించిన కేసులో పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2012లో అబ్దుల్ సలామ్ను ఉగ్రవాదిగా గుర్తించింది. చాలా సంవత్సరాల తరువాత భుట్టావీని ఉగ్రవాద నిధుల ఆరోపణలపై పాకిస్తాన్ అరెస్టు చేసింది. సుమారు మూడేళ్ల క్రితం లష్కర్ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావ అబ్దుల్ రెహ్మాన్ మక్కీతో పాటు ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా నిర్ధారణ జరిగింది. భుట్టవీకి ఆగస్టు 2020లో పదహారున్నరేళ్ల శిక్ష విధించబడింది.
Read Also:Odisha: భార్యపై అనుమానం.. పసిబిడ్డకు పురుగుమందుతో ఇంజెక్షన్..
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను 2002 , 2008లో పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎల్ఇటి తాత్కాలిక అధిపతిగా పనిచేశారు. పంజాబ్ ప్రావిన్స్లోని షేక్పురా జైలులో అబ్దుల్ సలామ్ గుండెపోటుతో మరణించినట్లు సోమవారం అర్థరాత్రి ప్రకటించారు. 78 ఏళ్ల తీవ్రవాది భుత్తావి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను కూడా ఓ సంస్థ విడుదల చేసింది. భుత్తావీ అంత్యక్రియలు మంగళవారం ఉదయం లాహోర్ సమీపంలోని మురిడ్కేలోని ఉగ్రవాద సంస్థ మర్కజ సెంటర్లో జరిగాయి.
Read Also:Vizag Job Scam: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
భారత ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉగ్రవాది భుట్టావి మరణాన్ని ధృవీకరించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదని చెప్పారు. నవంబర్ 2008లో, 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోని అనేక ప్రదేశాలలో తీవ్రవాద దాడులకు పాల్పడ్డారు. ఇందులో అమెరికా, ఇజ్రాయెల్ వంటి అనేక దేశాల పౌరులతో సహా మొత్తం 166 మంది మరణించారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. తరువాత పాకిస్తాన్ కూడా దాడులకు పాల్పడినందుకు ఆపరేషన్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీతో సహా లష్కరే తోయిబాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో పురోగతి లేదు.
తాజావార్తలు
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!