Merugu Nagarjuna: చంద్రబాబు కుయుక్తులను ఎవరూ నమ్మొద్దు.. మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna Comments On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుయుక్తులను ఎవరూ నమ్మొద్దంటూ మంత్రి మేరుగు నాగార్జున సూచించారు. సీఎం జగన్ నాలుగేళ్ల పరిపాలనలో పేదలకు అన్ని పథకాలు అందుతున్నాయని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరిస్తున్నామని అన్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లను డీబీటీ ద్వారా అవినీతి లేకుండా అందిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో దళిత సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని, దళితులపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కారని ఆరోపించారు. కానీ.. జగన్ ప్రభుత్వం దళితులపై దాడులు జరిగితే వెంటనే స్పందిస్తుందని, సొంత పార్టీ వారిని సైతం జైల్లో పెట్టామని తెలిపారు. ఉత్తుత్తి హామీలతో చంద్రబాబు మళ్లీ వస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కండకావరమని, పేదల ఇళ్లను కూడా స్మశానాలతో పోల్చారని మండిపడ్డారు. ఇంతకీ పూర్ టు రిచ్ అంటే ఏంటి? అసలు పూర్ ఎవరు? అని ప్రశ్నించారు.
Dy CM Narayana Swamy: చంద్రబాబు పాలన రాక్షసరాజ్యం.. జగన్ పాలన రామరాజ్యం
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
అంతకుముందు కూడా చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు.. రాష్ట్రంలోని పేదలందర్నీ ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాననే చందంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో.. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని విమర్శించారు. వైసీపీ అమలు చేస్తున్న అమ్మఒడి పథకాన్నే.. అమ్మకు వందనం అనే పేరుతో కాపీ కొట్టారన్నారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం చంద్రబాబుకు తన 75 ఏళ్ల వయసులో, రాజకీయ జీవన సంధ్యలో గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. సరికొత్త వాగ్దానాలు చేయడం, నాటకాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు.
Kunamneni Sambasiva Rao : ఒడిశా ఘటనకు ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించాలి
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!