Merugu Nagarjuna: చంద్రబాబు కుయుక్తులను ఎవరూ నమ్మొద్దు.. మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna Comments On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుయుక్తులను ఎవరూ నమ్మొద్దంటూ మంత్రి మేరుగు నాగార్జున సూచించారు. సీఎం జగన్ నాలుగేళ్ల పరిపాలనలో పేదలకు అన్ని పథకాలు అందుతున్నాయని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరిస్తున్నామని అన్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లను డీబీటీ ద్వారా అవినీతి లేకుండా అందిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో దళిత సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని, దళితులపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కారని ఆరోపించారు. కానీ.. జగన్ ప్రభుత్వం దళితులపై దాడులు జరిగితే వెంటనే స్పందిస్తుందని, సొంత పార్టీ వారిని సైతం జైల్లో పెట్టామని తెలిపారు. ఉత్తుత్తి హామీలతో చంద్రబాబు మళ్లీ వస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కండకావరమని, పేదల ఇళ్లను కూడా స్మశానాలతో పోల్చారని మండిపడ్డారు. ఇంతకీ పూర్ టు రిచ్ అంటే ఏంటి? అసలు పూర్ ఎవరు? అని ప్రశ్నించారు.
Dy CM Narayana Swamy: చంద్రబాబు పాలన రాక్షసరాజ్యం.. జగన్ పాలన రామరాజ్యం
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
అంతకుముందు కూడా చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు.. రాష్ట్రంలోని పేదలందర్నీ ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. అమ్మకు అన్నం పెట్టడుగానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాననే చందంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో.. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని విమర్శించారు. వైసీపీ అమలు చేస్తున్న అమ్మఒడి పథకాన్నే.. అమ్మకు వందనం అనే పేరుతో కాపీ కొట్టారన్నారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం చంద్రబాబుకు తన 75 ఏళ్ల వయసులో, రాజకీయ జీవన సంధ్యలో గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. సరికొత్త వాగ్దానాలు చేయడం, నాటకాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు.
Kunamneni Sambasiva Rao : ఒడిశా ఘటనకు ప్రధాని మోడీ నైతిక బాధ్యత వహించాలి
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!