Meruga Nagarjuna: చంద్రబాబుది కుట్ర రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ అభిప్రాయాలని ఇతర మార్గాల ద్వారా చెప్పించారు. సంక్షేమ పథకాలు ఆగిపోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నా. అంబేద్కర్, పూలే , పెరియార్ రామస్వామి ఆలోచనలు ఈ రోజు అమలవుతున్నాయి. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.
ఈ పథకాన్ని ఆపాలనా చంద్రబాబు ఉద్దేశం..? రైతు భరోసా ద్వారా రూ. 20162 కోట్లు రైతులకి అందిస్తుంటే ఈ పధకాన్ని అందకుండా చేయాలని టీడీపీ కుట్ర. చేస్తోందన్నారు. రూ. 9180 కోట్లు చేయూత ద్వారా అందిస్తుంటే ఈ పధకాన్ని ఆపాలనా మీ కుట్రలు..? అని మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. 78.75 లక్షల వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 12756 కోట్లు అందిస్తుంటే ఈ పధకాన్ని ఆపాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం ఆపడానికి కోర్డులకి వెళ్లారు. నాడు నేడులో పాఠశాలలు, ఆసుపత్రులు తీర్చి దిద్దుతుంటే ఆ పధకాన్ని ఆపాలని కుట్రలు జరుగుతున్నాయి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీనిచ్చి చేతులెత్తేసింది చంద్రబాబు కాదా..? అని మంత్రి నాగార్జున ప్రశ్నించారు. పేదల అండగా ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే ఎందుకీ కుట్రలు చేస్తున్నారు..? ఈ పథకాలన్నీ ఆపాలని పక్కా ప్రణాళికతో విషం చిమ్ముతున్నారు.
కోవిడ్ సమయంలోనూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమపధకాలే నిరుపేదలకి అండగా నిలిచింది వాస్తవం కాదా..? సీఎం వైఎస్ జగన్ నేరుగా ప్రజలకే రూ. 1.40 కోట్లు డీబీటీ ద్వారా అందించడం తప్పా..? 70 శాతం మంత్రి పదవులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సీఎం వైఎస్ జగన్ అవకాశమిస్తే నీ క్యాబినెట్లో ఎస్టి, మైనార్టీలకి అవకాశమే ఇవ్వలేదన్నారు మంత్రి నాగార్జున.
Read Also:MP Santosh Kumar: మట్టిని కాపాడుకుందాం.. మొక్కను బతికించుకుందాం
తాజావార్తలు
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!