Meruga Nagarjuna: చంద్రబాబుది కుట్ర రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ అభిప్రాయాలని ఇతర మార్గాల ద్వారా చెప్పించారు. సంక్షేమ పథకాలు ఆగిపోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నా. అంబేద్కర్, పూలే , పెరియార్ రామస్వామి ఆలోచనలు ఈ రోజు అమలవుతున్నాయి. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.
ఈ పథకాన్ని ఆపాలనా చంద్రబాబు ఉద్దేశం..? రైతు భరోసా ద్వారా రూ. 20162 కోట్లు రైతులకి అందిస్తుంటే ఈ పధకాన్ని అందకుండా చేయాలని టీడీపీ కుట్ర. చేస్తోందన్నారు. రూ. 9180 కోట్లు చేయూత ద్వారా అందిస్తుంటే ఈ పధకాన్ని ఆపాలనా మీ కుట్రలు..? అని మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. 78.75 లక్షల వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 12756 కోట్లు అందిస్తుంటే ఈ పధకాన్ని ఆపాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం ఆపడానికి కోర్డులకి వెళ్లారు. నాడు నేడులో పాఠశాలలు, ఆసుపత్రులు తీర్చి దిద్దుతుంటే ఆ పధకాన్ని ఆపాలని కుట్రలు జరుగుతున్నాయి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీనిచ్చి చేతులెత్తేసింది చంద్రబాబు కాదా..? అని మంత్రి నాగార్జున ప్రశ్నించారు. పేదల అండగా ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే ఎందుకీ కుట్రలు చేస్తున్నారు..? ఈ పథకాలన్నీ ఆపాలని పక్కా ప్రణాళికతో విషం చిమ్ముతున్నారు.
కోవిడ్ సమయంలోనూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమపధకాలే నిరుపేదలకి అండగా నిలిచింది వాస్తవం కాదా..? సీఎం వైఎస్ జగన్ నేరుగా ప్రజలకే రూ. 1.40 కోట్లు డీబీటీ ద్వారా అందించడం తప్పా..? 70 శాతం మంత్రి పదవులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సీఎం వైఎస్ జగన్ అవకాశమిస్తే నీ క్యాబినెట్లో ఎస్టి, మైనార్టీలకి అవకాశమే ఇవ్వలేదన్నారు మంత్రి నాగార్జున.
Read Also:MP Santosh Kumar: మట్టిని కాపాడుకుందాం.. మొక్కను బతికించుకుందాం
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!