ఏపీలో మూడు వేలు దాటిన కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు.. ఇవాళ మరోసారి పెరిగాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ 3000 దాటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,205 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,87,879 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో కోవిడ్తో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇక కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,505 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10, 119 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 281 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 63, 255 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 41,954 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,17,08,637 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Read Also: ఇంట గెలిచి రచ్చ గెలవండి దొరా.. కేసీఆర్పై షర్మిల ఫైర్
Also Read
- IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
- RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- TDP Mahanaadu 2026: మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట.
కాగ ఈ రోజు విశాఖలో అత్యధికంగా 695 కేసులు, చిత్తూరులో 607 కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. జనవరి 1వ తేది వరకు రోజుకు 176 కేసులు నమోదయ్యాయి. కానీ ఈ పదిరోజుల్లో ఒక్కసారిగా కేసులు నమోదయ్యాయి. మరో వైపు సంక్రాంతి పండుగ ఉండటంతో చాలా మంది హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి స్వంత ఇళ్లకు చేరుకుంటున్నారు. కాగా దీంతో పండుగ తర్వాత కేసులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మరో వైపు ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను సైతం పండగ అనంతరం అమలు చేయనుంది. ఈ లోపులో ఎన్ని కేసులు పెరుగుతాయనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. వైద్యాఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!